హోరాహోరీగా జరిగిన సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి జాతీయ స్థాయిలోని పోల్ ట్రెండ్తో పాటుగా ఆంధ్రప్రదేశ్లో శాసనసభ, లోక్సభ ఎన్నికల సంబంధించిన ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను కూడా ప్రకటించాయి. జాతీయ ఛానెళ్లతో పాటు, ఆంధ్ర ఆక్టోపస్ లగడపాటి రాజగోపాల్, ఇతర సర్వే సంస్థలు ఏపీలో ఏ పార్టీకి ఎన్ని సీట్లు అనే విషయంలో లెక్కలు వేశాయి. కొన్ని సంస్థలు ఏపీలో మళ్లీ టీడీపీయే అధికారంలోకి వస్తుందని తేల్చగా.. మరికొన్ని సంస్థలు ఈసారి వైసీపీకే ఆంధ్ర ఓటర్లు పట్టం కట్టబోతున్నారని ప్రకటించాయి.అయితే, జనసేన గురించి మాత్రం ఆసక్తికరంగా తేల్చేశారు.
ఆయా మీడియా సంస్థలన్నీ ఇటు టీడీపీకి అనుకూలంగా చెప్పిన సంస్థలుగానీ, అటు వైసీపీకి అనుకూలంగా ఫలితాలు ఉంటాయన్న సంస్థలుగానీ పూర్తిస్థాయి మెజార్టీనే కట్టబెట్టాయి కానీ రాష్ట్రంలో హంగ్కి అవకాశం ఉన్నట్టు ఏ సంస్థా పేర్కొనలేదు. జనసేన అధ్యక్షుడు పవన్ ఎంట్రీతో పరిస్థితి మారుతుందని వేసిన అంచనాలు విఫలం అయ్యాయి. మరోవైపు ఎగ్జిట్స్ పోల్స్ని బట్టి చూస్తే పవన్ కల్యాణ్… జనసేన పార్టీకి స్వల్ప సంఖ్యలో సీట్లే దక్కుతాయని అర్ధమవుతోంది. త్రిముఖ పోరులో జనసేన పార్టీ భారీగా ఓట్లు పొందండంతో టీడీపీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఏ పార్టీ విజయావకాశాల్ని దెబ్బతీసిందన్నది అబద్దమని తేలింది.
స్థూలంగా “నేను ముఖ్యమంత్రిని అవుతాను“ అని ప్రకటించుకున్న పవన్ కళ్యాణ్కు అంత సీన్ లేదని ఎగ్జిట్ పోల్స్ తేల్చాయి. ఇంకా చెప్పాలంటే..రెండంకెల సీట్లు చేరుకోవడమే కష్టమని ప్రకటించాయి. అయితే, ఎగ్జిట్ పోల్స్ ఇలా షాకిచ్చినా..జనసేన వైపు నుంచి ఎలంటి స్పందన లేకపోవడం చర్చనీయాంశంగా మారింది.