ఏపీలో గురువారం నాడు వెలువడిన సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో వైసీపీ ప్రభంజనం సృష్టించింది. ఈ క్రమంలో వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి నేతృత్వంలోని మొత్తం నూట
యాబై మూడు మంది విజయం సాధించారు. ఇరవై రెండు మంది ఎంపీలు గెలిచారు. ఈ తరుణంలో వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి గురించి ఒక సంచలన మెసేజ్ వైరల్
అవుతోంది.
అదే వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్ది అదృష్ఠ సంఖ్య మూడు అంటూ సోషల్ మీడియా,ట్విట్టర్లో ఒక పోస్టు వైరల్ అవుతోంది. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో
వైఎస్సార్ కడప జిల్లా పులివెందుల నుండి బరిలోకి దిగిన వైఎస్ జగన్మోహాన్ రెడ్డి మొత్తం 90,543ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఆ మొత్తం కూడితే మూడు వస్తుంది. అట్నే వైఎస్
జగన్మోహాన్ రెడ్ది డిసెంబర్ 21న జగన్ పుట్టిన రోజు ..
దీన్ని కూడిన కానీ మూడే వస్తుంది. అదే విధంగా వైసీపీ పార్టీని స్థాపించింది మార్చి 12.దీన్ని కూడిన కానీ మూడే .. పార్టీ స్థాపించింది మూడో నెలలో.. జెండాలో ఉంది మూడు రంగులు.. ఫ్యాన్ కు ఉంది మూడు రెక్కలు.. కావున జగన్ అదృష్ట సంఖ్య మూడు అంటూ పోస్టును వైరల్ చేస్తోన్నారు. అయితే జగన్ ఈ నెల ముప్పై తేదిన నవ్యాంధ్ర ముఖ్యమంత్రిగా విజయవాడ వేదికగా ప్రమాణ స్వీకారం చేయనున్న సంగతి తెల్సిందే.