ఏపీలో ఇటీవల విడుదలైన సార్వత్రిక ఎన్నికల్లో 151అసెంబ్లీ స్థానాల్లో,22పార్లమెంట్ నియోజకవర్గాల్లో వైసీపీ తరపున బరిలోకి దిగిన అభ్యర్థులు ఘనవిజయం సాధించారు. నూట యాబై ఒక్క స్థానాలతో అసెంబ్లీలో సింగల్ లార్జెస్ట్ పార్టీగా
అవతరించడంతో సర్కారును ఏర్పాటు చేయాల్సిందిగా ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహాన్ వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డిను కోరారు.
దీంతో ఈ నెల ముప్పై తారీఖున నవ్యాంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రిగా రాష్ట్రంలోని విజయవాడలో ప్రమాణ స్వీకారం చేయనున్నారు జగన్. అయితే నిన్నమొన్నటివరకు జగన్ తో పాటు కొంతమంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అయితే తాజాగా ఒక వార్త ప్రచారంలో జరుగుతుంది.
అదే ఈ నెల ముప్పై నాడు కేవలం వైఎస్ జగన్మోహాన్ రెడ్డి ఒక్కరే ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నారని అంటున్నారు. ఇంకా కొత్త మంత్రివర్గ కూర్పుపై వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి కసరత్తులు చేస్తొన్నారు వైసీపీ శ్రేణులు చెబుతున్నారు.