ఆంద్రప్రధేశ్ రాష్ట్రం మొత్తం వైసీపీ గాలి వీచి మొత్తం 175 స్థానాల్లో 151 సీట్లు అత్యధిక మెజార్టీతో గెలిచింది. వైసీపీ అధినేత వైఎస్ జగన్ దెబ్బకు టీడీపీలో సినీయర్ నేతలందరు ఓడిపోయారు. రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ తరపున 23మంది మాత్రమే గెలిచారు. అయితే ఎన్నికల ఫలితాలు వచ్చి పట్టుమని పది రోజులు కూడ కాలేదు అప్పుడు టీడీపీ నుండి ఇతర పార్టీలోకి వలసలు ప్రారంభం అవుతున్నాయి. తాజాగా ప్రకాశం జిల్లా అద్దంకి నియోజకవర్గం నుంచి సార్వత్రికి ఎన్నికల్లో టీడీపీ టికెట్పై బరిలోకి దిగి విజయం సాధించిన గొట్టిపాటి రవికుమార్ పార్టీ మారుతున్నట్లు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. కేంద్రంలో బలంగా గెలిచిన బీజేపీలో గాని, ఏపీలో అత్యధిక సీట్లు గెలిచిన వైసీపీలో చేరుతున్నట్లు రాజకీయ వర్గాలు తెలుపుతున్నాయి. దానికి కారణాలు కూడ కామెంట్ల రూపంలో తెలియజేస్తున్నారు. ఎలాగో ఏపీలో మరో 10 ఏళ్లు టీడీపీ అధికారంలోకి రాదు కనుక ఇక టీడీపీలో ఉండి లాభం లేదు ఏదో ఒక పార్టీ మారాలి అనుకుంటున్నట్లు సోషల్ మీడియాలో తెగ ప్రచారం చేస్తున్నారు. చూడాలి మరి ఎప్పుడు ఏ పార్టీ లో జాయిన్ అవుతాడో.