Home / 18+ / కేసీఆర్, జగన్ ఢిల్లీ వెళ్లకపోవడానికి కారణం తెలుసా.?

కేసీఆర్, జగన్ ఢిల్లీ వెళ్లకపోవడానికి కారణం తెలుసా.?

ఏపీ ముఖ్యమంత్రిగా జగన్ ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా హాజరయ్యారు. అయితే ఈ కార్యక్రమం అనంతరం ఇద్దరూ విమానంలో ఢిల్లీ పర్యటనకు వెళ్లాల్సి ఉంది. కాగా అకస్మాత్తుగా వారి పర్యటన రద్దు అయ్యింది. మోడి ప్రమాణస్వీకారానికి జగన్, కేసీఆర్ లకు ఆహ్వానాలు అందాయి. దీంతో ఇద్దరూ కలిసి ఢిల్లీ వెళదాం అనుకున్నారు. కానీ వారి పర్యటన రద్దయ్యింది. ఢిల్లీలో విమానం ల్యాండింగ్ కి అనుమతి లేకపోవడంతో వీరి పర్యటన రద్దు అయింది. షెడ్యూల్ లోని విమానాల ల్యాండింగ్ కి పౌరవిమానయాన శాఖ అనుమతులు రద్దు చేసింది. ప్రధాని ప్రమాణ స్వీకారం కాబట్టి భద్రతా లోపాలు తలెత్తకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకుంది. అయితే తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు తమ విమానానికి ముందుగా అనుమతి తీసుకోకపోవడంతో వారి పర్యటనను రద్దు చేసుకున్నారని తెలుస్తోంది.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat