వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ తాజాచిత్రం లక్ష్మీస్ ఎన్టీఆర్ ఈనెల 31న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ విషయాన్ని ఆదివారం విజయవాడలో వర్మ వెల్లడించారు. అనంతరం ఆయన జగన్ ప్రమాణస్వీకారంలో పాల్గొని అక్కడినుంచి వెస్ట్ గోదావరి జిల్లాకు వెళ్లారు. అక్కడ వర్మ మాట్లాడుతూ, తాము వస్తున్న సైకిల్ చక్రాలు పంక్చర్ అయ్యాయని అందుకే కారులో వచ్చామని తెలిపారు. మరోవైపు లక్ష్మీస్ ఎన్టీఆర్ ఈనెల 31వ తేదీన విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. ఈ సినిమాను లక్ష్మీ పార్వతి దృక్కోణం నుంచి తీసినట్టు వివరించారు. ఇందులో అన్నీ నిజాలే ఉంటాయన్నారు. ఈ సినిమా విడుదలైతే నిజాలు బయటపడతాయనే ఉద్దేశ్యంతోనే లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రం విడుదలకాకుండా అడ్డుకున్నారని తెలిపారు.
తనకు రైతుల కష్టాలు తనకు తెలియవన్నారు. తాను ఎపుడూ పొలంపనులు చేయలేదన్నారు. రాజకీయాల్లోకి రాను, ప్రజలకు సేవచేసే ఉద్దేశం తనకు లేదని వర్మ చెప్పారు. త్వరలో కమ్మ రాజ్యంలో కడపరెడ్లు సినిమా తీయబోతున్నట్లు వర్మ అన్నారు. అయితే గతంలో పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన తెలుగుదేశం పార్టీ నాయకులు కావాలని వర్మను టార్గెట్ చేస్తూ దారుణంగా విమర్శించారు. ఇప్పుడు ఆ ఉదంతాన్ని గుర్తు చేసుకుంటూ కావాలని వారికి దంకీ ఇయ్యనీకే వర్మ పశ్చిమ గడ్డపై నిలబడి సైకిల్ చక్రాలు పంక్చర్ అయ్యాయని విమర్శించారంటూ చెప్పుకుంటున్నారు.