వైవీ సుబ్బారెడ్డి..ఇతడు జగన్ కు సొంత కుటుంభ వ్యక్తి అన్నట్టు.జగన్ కు వరుసకు బాబాయ్ అవుతాడు.వైవీ సుబ్బారెడ్డి 2014ఎన్నికల్లో ఒంగోలు నుండి ఎంపీగా పోటీ చేసి విజయం సాదించారు.అలాంటి మనిషికి 2019ఎన్నికల్లో జగన్ సీటు ఇవ్వలేదు.టీడీపీ నుంచి వైసీపీలోకి వచ్చిన మాగుంట శ్రీనివాసులు కోసం వైవీని పక్కన పెట్టారు జగన్.అయినప్పటికీ ఆయన దిగులు చెందలేదు తన త్యాగానికి ఫలితం దక్కిందనే చెప్పుకోవాలి.ప్రస్తుతం ఇప్పుడు అందరు జగన్ గెలుపు కోసం తన సీట్ త్యాగం చేసిన బాబాయ్ కి ఎలాంటి పదవి ఇవ్వబోతున్నారని చర్చించుకుంటున్నారు.అయితే మొన్నటివరకు వైవీకి టీటీడీ చైర్మన్ ఇస్తారని ప్రచారం జరిగింది.అయితే జగన్ ఇప్పుడు తన వైవీకి అంతకన్నా పెద్ద పదవి రాజ్యసభ సీటును ఇచ్చేందుకు నిర్ణయం తీసుకున్నట్టు పార్టీ వర్గాల సమాచారం.వైవీ సుబ్బారెడ్డి తన బాబాయ్ కావడం అంతేకాకుండా ఎంపీ సీటు త్యాగం చేయడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం.