గుంటూరు జిల్లా చిలకలూరిపేట వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే విడదల రజినీ మరోసారి తన మానవతా హృదయాన్ని చాటుకున్నారు. ఎమ్మెల్యే అయిన నాటినుంచి డైనమిక్ లీడర్ గా దూసుకెళ్తున్నారు. గెలిచిన వారం రోజుల్లోనే అందరు అధికారులను పిలిచి తప్పు ఒప్పులు ఎంటే సరిచేసుకోవాలని కోరారు. విననివారికి వార్నింగ్ కూడా ఇచ్చారు. తనకు లంచాలు, డబ్బులు వద్దని.. చిలకలూరి పేట ప్రజల ముఖాల్లో నవ్వు మాత్రమే కావాలని కోరారు. అయితే తాజాగా చిలకలూరిపేట నుంచి గుంటూరు వెళ్లే దారిలో తిమ్మాపురం దగ్గర వసంత స్పిన్నింగ్ మిల్ సమీపంలో ఆక్సిడెంట్ అయ్యింది.
అయితే అటుగా కారులో వెళ్తున్న చిలకలూరిపేట ఎమెల్యే రజిని చూసి చూడనట్టు వెళ్లిపోకుండా వెంటనే ప్రమాదస్థలం వద్ద కారు ఆపారు.. క్షతగాత్రులకు ధైర్యం చెప్పారు.. వెంటనే అంబులెన్స్ కి స్వయంగా ఫోన్ చేసి త్వరగా రావాలని కోరారు. బాధితులకు అత్యవసర వైద్యం అందచేయాలని హాస్పిటల్ సిబ్బంది కి ఫోన్ చేసి చెప్పారు. ఎమ్మెల్యే సమయానికి అక్కడికి వచ్చి అంబులెన్స్ సిబ్బందితోపాటు హాస్పిటల్ లోని వైద్యులకు తెలపడం వల్ల తమకు మేలు జరిగిందంటూ బాధితులు హర్షం వ్యక్తం చేసారు. పైగా ప్రజలకు నాయకులు సేవకులుగా మారారని, ప్రభుత్వం మారిన తర్వాత ఎమ్మెల్యేలు అందరూ ప్రజలకు అందుబాటులో ఉంటున్నారనేది సర్వత్రా హర్షించదగ్గ విషయం.