బహరేన్ లో ఎన్నారై టీఆర్ఎస్ సెల్ బహరేన్ అధ్వర్యంలో తెలంగాణా రాష్ట్ర ఆవిర్భావదినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు.
ఉపాధ్యక్షుడు వెంకటేష్ బొలిశెట్టి అధ్యక్షతన జరిగిన ఈ వేడుకల్లో కార్యక్రమంలో ముందుగా తెలంగాణ సిద్ధాంత కర్త జయశంకర్ గారి చిత్ర పటానికి పూలతో నివాళుర్పించి, అమరవీరులని స్మరించుకొని రెండు నిమిషాలు మౌనం పాటించారు.అనంతరం కేకును కట్ చేసి ఆనందోత్సాలతో ఆవతరణ వేడుకలు జరుపుకున్నారు.
ఈ సంధర్భంగా ఎన్నారై టీఆర్ఎస్ సెల్ అధ్యక్షులు రాధారపు సతీష్ కుమార్ మాట్లాడుతూ బహరేన్ లో తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాలు ఐదవ సారి జరుపుకుంటున్నందుకు సంతోషంగా వుంది అని , అమరవీరుల త్యాగఫలం తో,కెసిఆర్ గారి సారథ్యం తో, ప్రత్యేక తెలంగాణా రాష్ట్రం ఏర్పడిన తరుణంలో ఈరోజు ముఖ్యమంత్రి గారు చేస్తున్న ఆభివృద్ధి పనులు,సంక్షేమ కార్యక్రమాలు విజయపథం లో దూసుకెళ్తూ తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలుస్తోందన్నారు.
తెలంగాణా రాష్ట్రాన్ని ప్రపంచ వేదికపై పరిచయం చేయడానికి మా వంతు బాధ్యతతో కృషి చేస్తున్నామనీ, తెలంగాణా ఉద్యమంలో ఎన్నారై ల పాత్ర ఎనలేనిదని ఇక్కడ జరిగిన ఉద్యమానికి చరిత్రలో ప్రత్యేక స్థానం ఉంటుందన్నారు. మన ముఖ్యమంత్రి కెసిఆర్ గారు కొత్త కొత్త పథకాలతో ముందుకెళ్తూ అన్ని వర్గాల ప్రజల సంక్షేమానికి కృషి చేస్తున్నారన్నారు. ముఖ్యమంత్రి గారికి మా కృతజ్ఞతలు కెసిఆర్ గారి బంగారు తెలంగాణా సాధనకై అందరు తమవంతు కృషి చేయాలనీ ఆయన కోరారు. పార్లమెంట్,పరిషత్ ఎన్నికల్లో టీఆర్ఎస్ కు అద్భుత విజయాలను అందించిన ప్రజలకు మా ఎన్నారై తెరాస పక్షాన ధన్యవాదాలు. గెలుపొందిన టిఆర్ఎస్ ఎంపీ, ఎంపిటిసి, జడ్పీటీసీ అభ్యర్థులకు శుభాభినందనలు.
ఈ వేడుకల్లో ఎన్నారై టీఆర్ఎస్ సెల్ అద్యక్షులు రాధారపు సతీష్ కుమార్ , ఉపాధ్యక్షులు వెంకటేష్ బొలిశెట్టి ,ప్రధాన కార్యదర్శులు పుప్పాల బద్రి ,మగ్గిడి రాజేందర్,గుమ్ముల గంగాధర్,సెక్రటరీ లు సంగేపు దేవన్న, జాయింట్ సెక్రటరీలు నేరెళ్లరాజు , ప్రమోద్ బొలిశెట్టి ,సాయన్న కొత్తూరు ,బాజన్న,నడిపి సాయన్న , నరేష్ ఎల్లుల ,రాంబాబు,జాగృతి అధ్యక్షులు బాబు రావు తదితరులు హాజరైన వారిలో వున్నారు.