తెలంగాణ రాష్ట్రంలో గతేడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ములుగు అసెంబ్లీ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ తరపున బరిలోకి దిగి అధికార టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి,మంత్రి చందూలాల్ పై గెలుపొందిన సీతక్క పార్టీ మారుతున్నారు అని వార్తలు ప్రచారంలో ఉన్న సంగతి తెల్సిందే. ఈ క్రమంలో తనపై వస్తోన్న వార్తలపై స్పందించారు. ఆమె మీడియాతో మాట్లాడుతూ”తాను పార్టీ మారుతున్నాను. టీఆర్ఎస్ లో చేరుతున్నాను “అని వస్తోన్న వార్తలల్లో ఎటువంటి వాస్తవం లేదు. కొంతమంది తనంటే గిట్టనివాళ్ళే ఇలా విషప్రచారం చేస్తోన్నారు. తనపై కొంతమంది చేస్తోన్న ఒత్తిళ్లకు తాను లొంగను అని ఆమె తెలిపారు. ఆమె ఇంకా మాట్లాడుతూ” పార్టీ మారిన ఎమ్మెల్యేలకు ప్రజలే బుద్ధి చెబుతారు అని ఆమె విమర్శించారు.