ఏపీ ముఖ్యమంత్రి,వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి ఆ పార్టీ మహిళా విభాగ రాష్ట్ర అధ్యక్షురాలు,నగరి అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే ఆర్కే రోజాకు మంచి శుభవార్త తెలిపారు. నిన్న శనివారం జరిగిన మంత్రి వర్గ విస్తరణలో ఎమ్మెల్యే ఆర్కే రోజాకు చోటు దక్కని సంగతి తెల్సిందే. దీంతో ముఖ్యమంత్రి జగన్ ఆర్కే రోజాకు సరైన ప్రాధాన్యత ఇస్తానని హామీచ్చారు.
హామీలో భాగంగా ఆర్కే రోజా కోసం సీఎం జగన్ ఒక అద్భుతమైన నిర్ణయం తీసుకున్నారు. ఈ క్రమంలో ఆర్కే రోజాకు నామినేటెడ్ పోస్టు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారని సమాచారం. అందులో భాగంగా ఏపీఎస్ఆర్టీసీ ఛైర్మన్ పదవిని కట్టబెట్టనున్నారు అని సమాచారం.
ప్రస్తుతం ఆర్టీసీలో నెలకొన్న సమస్యలను పరిష్కరించడమే కాకుండా.. ఉద్యోగుల సమస్యలను పరిష్కరించి.. సంస్థను దశలువారిగా ప్రభుత్వంలో విలీనం చేయడం లాంటి చర్యలు తీసుకోవడం ఆర్కే రోజాకు మంచి మైలేజ్ వస్తోందని భావించిన సీఎం జగన్ రోజాకు ఈ అవకాశమివ్వాలని ఆలోచిస్తోన్నట్లు సమాచారం . అయితే నిన్న శనివారం మంత్రి వర్గ విస్తరణ కార్యక్రమం సందర్భంగా ఆర్కేరోజాను అందుబాటులో ఉండాలని చెప్పిన జగన్ ఈ నిర్ణయం కోసమే వైసీపీ శ్రేణులు గుసగుసలాడుతున్నారు.