Home / 18+ / ముఖ్యమంత్రిగా మొదటి క్యాబినేట్ మీటింగ్.. ఇవే ప్రధానాంశాలుగా చర్చ..

ముఖ్యమంత్రిగా మొదటి క్యాబినేట్ మీటింగ్.. ఇవే ప్రధానాంశాలుగా చర్చ..

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన కొత్తగా ఏర్పడిన మంత్రివర్గం తొలి సమావేశం సోమవారం ఉదయం 10.30గంటలకు సచివాలయంలోని తొలి బ్లాకు మొదటిఅంతస్తులో గల మంత్రివర్గ సమావేశం మందిరంలో ప్రారంభమైంది. ఈ కేబినెట్‌లోనే కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్లు తెలుస్తోంది. వారంరోజులుగా జరుగుతున్న వివిధ శాఖల అధికారిక సమీక్ష సమావేశాల్లో ఇలాంటి నిర్ణయాలకు సంబంధించిన సంకేతాలను జగన్‌ ఇచ్చారు. రైతులు, మహిళలు, అవ్వాతాతలు, వికలాంగులు, ఉద్యోగులు, కార్మికుల ప్రయోజనాలే ప్రధాన అజెండాగా కేబినెట్‌ సమావేశం నిర్వహిస్తున్నారు. సీఎం ఆదేశాలమేరకు అధికారులు ఎనిమిది అంశాలతో కేబినెట్‌ అజెండా రూపొందించారు. అక్టోబర్‌ 15నుంచి అమలు చేయనున్న వైయ‌స్ఆర్ రైతు భరోసా పథకంపై చర్చించారు. ముఖ్యంగా జగన్‌మోహన్‌రెడ్డి ప్రమాణస్వీకారం రోజు చేసిన ప్రకటనలు, మరో 8మంది అంశాలపై చర్చ జరుగుతుంది. దశలవారీగా పెన్షన్ల పెంపుపైనా కేబినెట్‌ నిర్ణయం తీసుకోబోతుంది. ఆశావర్కర్ల జీతాలపెంపుపైనా చర్చించనున్నారు. పారిశుద్ధ కార్మికులు, హోంగార్డుల జీతాల పెంపుపై చర్చిస్తున్నారు. ప్రభుత్వంలో ఆర్టీసీని విలీనంపై చర్చిస్తున్నారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat