ప్రముఖ కన్నడ నాటక రచయిత, జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత, పద్మశ్రీ, పద్మభూషణ్ గిరీశ్ కర్నాడ్ మృతి పట్ల తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ సంతాపం ప్రకటించారు. గిరీశ్ కర్నాడ్ కుటుంబ సభ్యులకు సీఎం కేసీఆర్ ప్రగాఢ సానుభూతి తెలిపారు. దేశ నాటక సాహిత్య రంగంలో ఎనలేని కృషి చేసిన గిరీశ్ కర్నాడ్ సేవలు అంతర్జాతీయంగా పేరు ప్రఖ్యాతులు పొందారని సీఎం కేసీఆర్ కొనియాడారు.
గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న గిరీశ్ కర్నాడ్ ఇవాళ ఉదయం తన నివాసంలో తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే. గిరీశ్ కర్నాడ్ మృతి పట్ల రాష్ర్టపతి రామ్ నాథ్ కోవింద్, ప్రధాని నరేంద్ర మోదీ, కర్ణాటక సీఎం కుమారస్వామి సంతాపం ప్రకటించారు. ఆయన మృతికి సంతాపంగా ఒక రోజు సెలవు, మూడు రోజులు సంతాప దినాలు ప్రకటించింది కర్ణాటక ప్రభుత్వం.