తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ పరిధిలోని కుత్బుల్లాపూర్ నియోజకవర్గానికి చెందిన సంబర బోయిన శివ (20) వికలాంగుడు. ఏదైనా ఉద్యోగం చేసుకుందామనుకుంటే ప్రయాణం ఇబ్బంది అవుతున్న నేపథ్యంలో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారికి వాట్సప్ లో మేసెజ్ పెట్టారు.
తనకు ఒక వాహనం ఇప్పించాలని కోరారు. కేటీఆర్ స్ధానిక ఎమ్మెల్సీ శబీపూర్ రాజుకి వాహనం ఏర్పాటు చేయవలసిందిగా సూచించారు. ఈమేరకు హొండా యాక్టివా వాహానాన్ని తన నిధులతో కోనుగోలు చేసి, ఈ రోజు ప్రగతి భవన్ లో కేటిఆర్ గారి సమక్షంలో శివకు అందిచారు. ఈరోజు మంత్రి మల్లారెడ్డి, యంఏల్సీ శంబీపూర్ రాజు,స్దానిక యంఏల్యే వివేక్ సమక్షంలో శివకు ద్విచక్రవాహానాన్ని అందించారు.