Home / 18+ / మంత్రుల ప్రమాణస్వీకారం తర్వాత మొదటిసారి జగన్ ని కలిసిన రోజా.. ఏం పదవి ఇచ్చారో తెలుసా.?

మంత్రుల ప్రమాణస్వీకారం తర్వాత మొదటిసారి జగన్ ని కలిసిన రోజా.. ఏం పదవి ఇచ్చారో తెలుసా.?

వైసీపీ ఎమ్మెల్యే, ఫైర్‌బ్రాండ్ రోజాకు మంత్రి పదవి దక్కని విషయంపై సర్వత్రా చర్చ జరిగింది. అయితే ఆఖరినిమిషం వరకూ రోజాకు మంత్రిపదవి వస్తుందా.? రాదా.? అనేది అభిమానులు, కార్యకర్తల్లో సర్వత్రా చర్చ నడిచింది. వైసీపీ కార్యకర్తలు సోషల్ మీడియా వేదికగా రోజాకు మంత్రిపదవి ఇవ్వాలని పెద్దఎత్తున డిమాండ్ కూడా చేశారు. అయితే సామాజికవర్గం పరంగా అందరికీ న్యాయం చేయాలని భావించిన సీఎం జగన్ రెడ్డి సామాజిక వర్గానికి కేవలం నలుగురికి మాత్రమే అవకాశం కల్పించారు.. ఎస్సీ ఎస్టీలు, బీసీలకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారు. దీంతో రోజాకు మంత్రి పదవి రాలేదు.

అయితే రెండున్నరేళ్ల తర్వాత కచ్చితంగా మంత్రి పదవి వస్తుందని మాత్రం జగన్ హామీ ఇచ్చారని సమాచారం. అయితే రోజాకు ఆర్టీసీ చైర్మన్ పదవి ఇవ్వాలనే యోచనలో జగన్ ఉన్నట్లు తెలుస్తోంది. దీనిపై విజయసాయిరెడ్డి రోజాతో చర్చించారని ఆమె ఓకే చెప్పార సమాచారం. మరో రెండ్రోజుల్లో అధికారికంగా ప్రకటన వెలువడనుందట.. ముఖ్యమంత్రి జగన్ కీలక నిర్ణయాలు, సంచలన ప్రకటనలు చేస్తున్నారు.. ఈక్రమంలో రెండున్నరేళ్లు ఆర్టీసీ చైర్మన్ లేదా మరో ముఖ్య పదవి ఇచ్చి తర్వాత మంత్రిని చేయనున్నట్టు తెలుస్తోంది. రోజా మాత్రం జగనన్న చెప్పింది. ఆదేశించింది తనకు శిరోధార్యం అని ఆయన ఆదేశాలకు అనుగుణంగా పనిచేస్తానని చెప్తున్నారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat