ప్రపంచంలో మనిషికి పరిపూర్ణ వ్యక్తిత్వ వికాసం రావాలి.. విద్యార్థులను సక్రమంగా తయారుచేసి సమాజంలోకి ప్రవేశింపజేస్తే సమాజానికి ఎంతో మేలుజరుగుతుంది. పాలకులు విద్యార్థుల సంఖ్య నమోదు పెంచడంలో సంబరపడకుండా బోధనలో నాణ్యతలపై దృష్టి పెట్టాలి. సరిగ్గా ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అదే పని మీద ఉన్నారు. ప్రైవేటు స్కూళ్ల ఫీజుల నియంత్రణపై రెగ్యులేటరీ కమీషన్ ఏర్పాటు చేస్తున్నారు. జగన్ ప్రతిపక్ష నేతగా ఉండి ప్రజలకిచ్చిన హామీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారంచేసిన వెంటనే అమలులోకి తెస్తున్నారు. మాటిస్తే వెనుతిరిగి చూసేదిలేదని జగన్ పాటించి చూపుతున్నారు. ప్రజలకిచ్చిన ప్రతీ హామీని నెరవేరుస్తామన్న ఈ యువ సీఎం విద్యావ్యవస్థలో సమూల మార్పులకు శ్రీకారం చుడుతున్నారు.
దేశంలో ఎక్కడా లేనివిధంగా రాష్ట్రంలో ప్రైవేటుస్కూళ్ల వ్యాపారం నడుస్తోంది. గవర్నమెంట్ స్కూళ్లను మూతపెట్టి గత ప్రభుత్వం సొంత పార్టీనేతలకు చెందిన ప్రైవేటు విద్యా సంస్థలకు విద్యారంగాన్ని దారాదత్తం చేసింది. దీంతో లక్షల్లో ఫీజులు మద్యతరగతి పిల్లల తల్లితండ్రులకు భారంగా మారాయి. ప్రభుత్వ బడులు లేక ప్రైవేటుస్కూళ్లు తప్ప గత్యంతరం లేక చంద్రబాబు ప్రభుత్వంలో సామాన్యులు ఇబ్బందులు పడుతున్నారు. అగ్గిపెట్టెల్లాంటి గదుల్లో అర్హతలేని ఉపాధ్యాయులతో వికాసానికి నోచుకోని చదువులకు విపరీతమైన ఒత్తిడి కలుగుతుంది. ఎల్కేజీకే లక్షలు కట్టాల్సిన పరిస్థితిలో సామాన్యులు నానా అవస్థలు పడుతున్నారు. టీడీపీ హయాంలో ప్రైవేటు విద్యాసంస్థల ఫీజులపై ఎలాంటి నియంత్రణ లేదు.
యూనిఫారం నుంచి పుస్తకాలవరకూ తమ దగ్గరే కొనాలని షరతులు పెడుతున్నారు. 100 పేజీల నోట్బుక్ బయట రూ.45ఉంటే చైతన్య స్కూళ్లలో రూ.100ఉంటుంది. ప్రాధమిక తరగతుల పిల్లలకు ఫీజు, పుస్తకాలు, ఇతర ఖర్చులు కలిపి ఏడాదికి ఏకంగా రూ.100000 పైగా ఖర్చు చేయాల్సి వస్తోంది. ప్రభుత్వ నియంత్రణ లేకపోవడంతో ప్రైవేటుసంస్థల ఇష్టారాజ్యంగా మారింది. ఇక యువ సీఎం జగన్ ప్రైవేటు విద్యా సంస్థల ఆగడాలకు కళ్లెం వేస్తున్నారు. ఎడ్యుకేషన్ మాఫియాపై ఉక్కుపాదం మోపుతున్నారు. ఫీజులతో విద్యార్థులను పీల్చి పిప్పిచేస్తే సహించేది లేదని హెచ్చరించారు. ప్రభుత్వం నిర్ణయించిన ఫీజులతోనే విద్యాసంస్థలు నడపాలని, కాదని ఎక్కువ ఫీజులు వసూలుచేస్తే ఆయా సంస్థలకు తాళాలు వేస్తామన్నారు. ఇది రాష్ట్రప్రజల చరిత్రలో శుభ పరిణామంగా కనిపిస్తోంది.