తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చిన్న వయసులో ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన రంగారెడ్డి జిల్లా యాచారం మండలం తక్కళ్లపల్లి తండాకు చెందిన ఆంగోతు తుకారాంను అభినందించారు. 8,848 మీటర్ల ఎత్తులో ఉన్న ఎవరెస్ట్ శిఖరాన్ని ఈ ఏడాది మే 22న ఎక్కిన తుకారాం దక్షిణ భారతంలోనే అతి చిన్న వయసులో ఎవరెస్ట్ను అధిరోహించిన వ్యక్తిగా గుర్తింపు పొందాడు. ఆయన నిన్న శుక్రవారం హైదరాబాద్లో కేటీఆర్ను కలిశారు. ఈ సందర్భంగా ఎవరెస్ట్ అధిరోహణలో కలిగిన అనుభవాలను కేటీఆర్ అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వపరంగా అవసరమైన సాయాన్ని అందించడానికి తోడ్పాటునందిస్తానని భరోసా ఇచ్చారు. అనంతరం తుకారాంను కేటీఆర్ సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి, ఎస్సీ కార్పొరేషన్ ఎండీ లచ్చీరాం, రాష్ట్ర సోలార్ అసోసియేషన్ అధ్యక్షుడు బుర్ర అశోక్కుమార్గౌడ్ పాల్గొన్నారు. తుకారాం 2018లో కిలిమంజారో పర్వత శిఖరాన్ని అధిరోహించి లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటుదక్కించుకున్నాడు.
Tags evarest governament harish rao kcr ktr slider telanganacm telanganacmo trs trswp