నీది నాది ఒకే కథ చిత్రంతో టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్న యంగ్ అండ్ డైనమిక్ డైరెక్టర్ వేణు ఊడుగుల. చిన్న సినిమాగా విడుదలైన ఈ చిత్రం సూపర్ డూపర్ హిట్ సాధించింది. తాజాగా మరో కొత్త ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారు వేణు. దగ్గుబాటి రానా హీరోగా బక్కపలుచు భామ, నేచూరల్ బ్యూటీ సాయిపల్లవి హీరోయిన్లుగా తెరకెక్కుతున్న తాజా చిత్రం విరాటపర్వం 1992.
ఒకప్పటి స్టార్ హీరోయిన్ అందాల రాక్షసి టబు కీలకపాత్రలో నటిస్తోన్న ఈ చిత్రాన్ని ఎస్ఎల్వి సినిమాస్,సురేష్ ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.ఈ రోజు శనివారం హైదరాబాద్ మహానగరంలో రామానాయుడు స్టూడియోలో పూజా కార్యక్రమాలు జరిగాయి.
నిర్మాత సురేష్ బాబు,హీరో హీరోయిన్లు సాయిపల్లవి,రానా,దర్శకుడు వేణు ,హీరో విక్టరీ వెంకటేశ్ లతో పాటు చిత్రం యూనిట్ ,పలువురు సినీ ప్రముఖులు ఈ కార్యక్రమానికి హజరయ్యారు. అయితే వేణు ఉడుగుల రెండు దశబ్ధాల కిందట అంటే 1990ల నాటి సామాజిక పరిస్థితుల ఆధారంగా ఈ మూవీని తెరకెక్కించనున్నాడు . డి సురేష్ బాబు స్క్రిప్ట్ అందజేయగా విక్టరీ వెంకటేష్ క్లాప్ కొట్టారు. గొట్టిపాటి రవి స్విచాన్ చేశారు. శారు. అయితే వచ్చే నెల జూలై నుండి రెగ్యులర్ షూటింగ్ జరిపేలా చిత్రం యూనిట్ ప్లాన్ చేస్తున్నారు.