కాళేశ్వరం ప్యాజెక్టు చూసి దేశమంతా గర్వపడుతుందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. సోమవారం టీఆర్ఎస్ఎల్పీలో మీడియాలో మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ నేతలు గాంధీభవన్లో కూర్చొని ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని..భట్టి విక్రమార్క అంత మేధావి ప్రపంచంలో లేడనుకుంటున్నారని ఎద్దేవా చేశారు. సీఎల్పీ నేతగా భట్టిని ఎన్నుకోవడం ఆ పార్టీ నేతలకే ఇష్టం లేదన్నారు.ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు విషయంలో తట్టెడు మట్టి కూడా తీయని దొంగలు…అతి తక్కువ సమయంలో పూర్తి అయిన ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టును చూసి ముక్కున వేలేసుకుంటున్నారని చెప్పారు.ముఖ్యమంత్రి స్వయంగా ఒక ఇంజనీర్ లాగా కష్టపడి కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తి చేయించారని చెప్పారు.అవినీతిలో కూరుకున్న పార్టీ లకు కేరాఫ్ అడ్రస్ కాంగ్రెస్ పార్టీ అని మండిపడ్డారు. నాలుగు పార్లమెంటు సీట్లు గెలిస్తే బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్ ఎగిసి ఎగిసి పడుతున్నాడని మండిపడ్డారు. పార్లమెంటు ఎన్నికల తరువాత జరిగిన ఎంపీటీసీ,జడ్పీటీసీ ఎన్నికలో గులాబీ జెండా మాది అని ప్రజలు తీర్పు ఇచ్చారు” అమీ అన్నారు.