ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ స్పీకర్ గా కోనా రఘుపతి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.ఈయన గుంటూరు జిల్లా బాపట్ల నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలిపొందరు.డిప్యూటీ స్పీకర్ గా ఆయన ఒక్కరిదే నామినేషన్ రావడంతో స్పీకర్ సీతారాం రఘుపతిని డిప్యూటీ స్పీకర్ గా ఎన్నికైనట్టు అధికారంగా ప్రకటించారు.స్పీకర్ ప్రకటన అనంతరం సభ నాయకుడు,ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి,ప్రతిపక్షనేత మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తదితరులు కోనా రఘుపతిని మర్యాదపూర్వకంగా స్పీకర్ స్థానంలో కూర్చోబెట్టి అభినందలు తెలియజేసారు.ఈ సందర్భంగా సభ సభ్యులు అందరు అభినందనలు చెప్పారు.
See Also : తెలుగు ప్రజలకు సీఎం కేసీఆర్ గుడ్ న్యూస్..!!
ఇది ఇలా ఉండగా మొన్న స్పీకర్ గా తమ్మినేని సీతారం ఏకగ్రీవంగా ఎన్నికైన విషయం అందరికి తెలిసిందే.ఈయనను కూడా జగన్ మర్యాదపూర్వంగా సభాపతి స్థానానికి తీసుకెళ్ళి అభినందనలు తెలిపారు.అయితే ఆ సమయంలో చంద్రబాబు మాత్రం తనకి కేటాయించిన స్థానంలో నిలుచున్నాడే తప్ప స్పీకర్ కి కనీస మర్యాద ఇవ్వలేదు,అంతేకాకుండా తనకి బదులుగా టీడీఎల్పీ ఉపనేత అచ్చెన్నాయుడిని పంపించారు చంద్రబాబు.ఈ విషయం పై అన్ని వర్గాలు చంద్రబాబుపై ధ్వజమెత్తాయి.40ఏళ్ళు రాజకీయ అనుభవం ఉందని చెప్పుకుంటున్న మీరు కనీస మర్యాద ఇవ్వాలని తెలియదా అని చంద్రబాబుపై విరుచుకుపడ్డాడు.బహుశా అందుకేనేమో ఈరోజు బుద్ధి వచ్చి డిప్యూటీ స్పీకర్ ను మర్యాదపూర్వకంగా సభాపతి కుర్చీ దగ్గరకు తీసుకెళ్ళారు అని నేటీజన్లు సెటైర్ లు వేస్తున్నారు.
See Also : పీఆర్సీపై త్వరలోనే సమావేశం.. సీఎం కేసీఆర్
See Also : చంద్రబాబుపై జగన్ ఫైర్..బాబుకి ముచ్చెమటలు !