వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఐన వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ఏపీప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.అప్పట్లో టీడీపీ ఏర్పాటు చేసిన సిట్ను రద్దు చేసి కొత్తగా 23 మంది అధికారులతో కొత్త సిట్ను ఏర్పాటు చేసారు జగన్.కడప,చిత్తూరు, అనంతపురం జిల్లాలకు సభందించిన 23 మంది పోలీస్ అధికారులతో ఈ కొత్త సిట్ ను ఏర్పాటు చేయడం జరిగింది.ఈ టీమ్ కడప జిల్లా ఎస్పీ అభిషేక్ మహంతి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసారు.ఈ మేరకు సిట్ అధికారులు నిన్న బుధవారం సాయంత్రం పులివెందులలోని వివేకా హత్య జరిగిన ఇంటిని పరిశీలించారు. వైఎస్ వివేకానందరెడ్డి మార్చి 15వ తేదీన తన ఇంటిలోనే దారుణహత్యకు గురయ్యిన విషయం తెలిసిందే.
తన ఇంటి బాత్రూమ్లో పడిపోయి ఉన్న వివేకను ఆయన మనుషులు ఆస్పత్రికి తీసుకెల్లినప్పటికీ అప్పటికే ఆయన మృతిచెందారు.వివేక బాత్రూమ్కు వెళ్లిన సమయంలో హటాత్తుగా హార్ట్ ఎటాక్ రావడంతో కింద పడి గాయాలు బారినపడి చనిపోయినట్టు మొదట చెప్పారు..కాని పోస్టుమార్టం అయ్యాక రిపోర్ట్ లో మాత్రం వివేక హత్యకు గురైనట్లు వచ్చింది.ఈ హత్యకేసులో ఇరు వర్గాల మధ్య భారీ ఎత్తున విమర్శలు కూడా వచ్చాయి.ఈ విషయంలో పులివెందుల వాసులు టీడీపీ నాయకుల పై అనుమానం వ్యక్తం చేసిన విషయం కూడా తెలిసిందే.అయితే ఇవ్వన్ని కప్పిపుచ్చడానికి టీడీపీ సర్కార్ సిట్ ఏర్పాటు చేసి విచారణ ప్రారంభించిన ఏమీ ఉపయోగం లేకపోవడంతో,ప్రస్తుత జగన్ ప్రభుత్వం కొత్త సిట్ను ఏర్పాటు చేసింది.