Home / SLIDER / తెలంగాణ బీళ్లకు ప్రాణహితమే కాళేశ్వరం

తెలంగాణ బీళ్లకు ప్రాణహితమే కాళేశ్వరం

 తెలంగాణ నీటిపారుదలలో కాళేశ్వరం ప్రాజెక్టు చారిత్రక మలుపు. గోదావరి జలాల వినియోగంలో కాళేశ్వరానికి ముందు.. కాళేశ్వరానికి తరువాత అని చెప్పుకొనేలా సరికొత్త అధ్యాయానికి నాంది. తలాపునే వేల టీఎంసీల గోదావరిజలాలు పారుతున్నా.. వంద టీఎంసీల వినియోగానికి సైతం మొహం వాచిన తెలంగాణ రైతాంగం ఇప్పుడు 500-600 టీఎంసీల వినియోగానికి సమాయత్తమవుతున్నది. గోదావరి బేసిన్‌లో 954 టీఎంసీల వాటా జలాలున్నా పట్టుమని పదిశాతం వాడుకోలేని తెలంగాణ గడ్డ.. ఇప్పుడు ఏకంగా 60-70 శాతం వినియోగ లక్ష్యాన్ని సాధించబోతున్నది. కడలి వైపు సాగే జలాలకు కాళేశ్వరం వద్ద అడ్డుకట్టతో ఇది సాక్షాత్కారం కానున్నది.

Package-Pump-House
గోదావరిలో తెలంగాణ వాటా 954 టీఎంసీలు. ఇంత భారీవాటాను వినియోగించుకునేందుకు నిన్నటిదాకా వెదికినా దారి కనిపించలేదు. దీంతో పట్టుమని పదిశాతం వాటా కూడా వాడుకోలేని దుస్థితి. శ్రీరాంసాగర్ నిర్మాణాన్ని చేపట్టిన గత పాలకులు దానినే వరప్రదాయిని అనుకోమన్నారు. 90 టీఎంసీల నిల్వసామర్థ్యంతో నిర్మించిన ఆ ప్రాజెక్టు.. పూడిక పేరుకుపోయి 40 శాతం సామర్థ్యానికి పడిపోయింది. ఎగువన మహారాష్ట్ర వరుస బరాజ్‌లతో గోదావరి జలాలను ఎక్కడికక్కడ ఒడిసిపట్టడంతో ఈ ప్రాజెక్టుది గత వైభవంగానే మారింది. ఎస్సారెస్పీ నీటి వినియోగంలో కీలకపాత్ర పోషించే కాకతీయ కాల్వ డిజైన్ ప్రవాహ సామర్థ్యం 8,500 క్యూసెక్కులైతే ఏనాడూ 2వేల నుంచి 3 వేల క్యూసెక్కులకు మించి ప్రవహించిన దాఖలాలు లేవు.

godavari
శ్రీరాంసాగర్‌కే వరద రాకపోగా.. ఆ తర్వాత ఉన్న ఎల్లంపల్లి ప్రాజెక్టుది తెలంగాణ ఏర్పడేనాటికి అయోమయ పరిస్థితే. మిడ్ మానేరు సవాలక్ష సమస్యలతో కునారిల్లుతుండగా.. అట్టహాసంగా ప్రారంభించిన దేవాదుల మూడు టీఎంసీల నీటిని కూడా పొలాలకు పారించిన సందర్భాల్లేవు. సింగూరు హైదరాబాద్ తాగునీటితోనే సరిపెట్టుకోగా… నిజాంసాగర్ వర్షాకాలంలోనూ క్రీడామైదానాన్నే తలపించింది. బచావత్ ట్రిబ్యునల్ ప్రకారం తెలంగాణ పరిధిలోని గోదావరి బేసిన్‌లోని చెరువుల ద్వారా నీటి వినియోగం 175 టీఎంసీలు. కానీ శిథిలావస్థకు చేరుకున్న చెరువుల కారణంగా అందులో సగం కూడా నీటి వినియోగం జరిగిన దాఖలాలు లేవు. దీంతో గోదావరిజలాల్లో 100-150 టీఎంసీలు వాడుకుంటే గగనంగా మారేది.

nandi-medaram-pump-house

తెలంగాణ బీళ్లకు ప్రాణహితమే..

గోదావరి జలాలను ఒడిసిపట్టే వనరులు లేక ప్రతిఏటా వేల టీఎంసీలు కడలి పాలయ్యేవి. కేంద్ర జలసంఘం అధికారిక రికార్డుల్లో దశాబ్దాలుగా నమోదయిన లెక్కలు ఇదే చెప్తున్నాయి. గోదావరి జలాలను ఎగువన ఉన్న మహారాష్ట్ర మాత్రమే మెరుగ్గా వినియోగించుకుంటున్నది. దిగువన ప్రాణహిత, ఇంద్రావతి, శబరితోపాటు అనేక వాగులు, వంకల ద్వారా వచ్చే భారీస్థాయి జలాలను వాడుకొనే పరిస్థితి లేకుండాపోయింది. నేడు కాళేశ్వరం ద్వారా తెలంగాణకు ఆ సదవకాశం వచ్చింది. గోదావరి నీటి లభ్యతలో ఏకంగా 35 శాతం కంట్రి బ్యూషన్ ఉన్న ప్రాణహిత జలాలను కాళేశ్వరం ప్రాజెక్టుతో వినియోగించుకునే వెసులుబాటు వచ్చింది. దీంతో గతంలో సముద్రంలోకి వృథాగా వెళ్లే గోదావరి జలాలకు అడ్డుకట్ట పడినట్టే. అదే సమయంలో తెలంగాణ పరిధిలో బీడు భూముల్లో గోదావరిజలాల వినియోగం పెరిగినట్లే. By Namasthe Telangana

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat