తెలుగుదేశం పార్టీకి చెందిన నలుగురు రాజ్యసభ సభ్యలు సుజనా చౌదరి, సీఎం రమేశ్, టి.జి వెంకటేష్, గరికపాటి రామ్మోహన రావు రాజ్యసభలో తమను వేరే గ్రూపుగా పరిగణించాలంటూ రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడుకు లేఖ ఇచ్చారు. రాజ్యంగ పరంగా ఆ లేఖను రాజ్యసభ చైర్మన్ ఆ లేఖకు ఆమోద ముద్ర వేశారు. అయితే, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఈ పరిణామాలపై కలత చెందారని ప్రచారం జరుగుతోంది. రాజకీయ పార్టీలలో చీలికలు, చేరికలు నానాటికి పెరుగుతుండడం పట్ల సన్నిహితుల వద్ద ఆందోళన వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం.
తెలుగుదేశం రాజ్యసభ సభ్యుడు తనకు లేఖ ఇవ్వడానికి రెండు రోజుల ముందు జరిగిన కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు చీటికీ మాటికీ పార్టీలు మారడంపై వెంకయ్యనాయుడు అసహనం వ్యక్తం చేసారు. ఇలా పార్టీలు మారిన వారు తమ పదవులకు రాజీనామా చేయాలని, ఆ తర్వాతే పార్టీ మారాలని ఆ కార్యక్రమంలో వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. ఒకవేళ సభ్యులు రాజీనామా చేయకపోతే ఆయా సభలు ఆ సభ్యుల పదవిని రద్దు చేయాలని కూడా సూచించారు. ఇది జరిగిన రెండు రోజులకే తెలుగుదేశం రాజ్యసభ సభ్యులు పార్టీ మారడం, వారిని ప్రత్యేక గ్రూపుగా పరిగణించాలని లేఖ ఇవ్వడం ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుకు మనస్తాపాన్ని కలిగించిందని ఆయన సన్నిహితులు చెబుతున్నారు.
అయితే, సీనియర్ రాజకీయ నాయకుడిగా, విలువలకు ప్రాధాన్యమిచ్చే నాయకుడిగా ఈ పరిణామాలపై కలత చెందినట్లు ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు తన సన్నిహితులతో పేర్కొనడం సంతోషకరమని, అయితే…ఏపీలో ఐదు సంవత్సరాల పాటు సీఎం హోదాలో చంద్రబాబునాయుడు ఇదే పనులను ప్రోత్సహించినప్పుడు…ఉపరాష్
See Also : వైఎస్ వివేకానందరెడ్డిని చంపిందెవరు?… పులివెందుల, జమ్మలమడుగు టీడీపీ నేతల్లో టెన్షన్…
See Also : స్వరూపానందుడి మనస్సులో స్థానం సంపాదించుకున్న కరణ్ రెడ్డి.. ప్రత్యేక అభినందనలు.
See Also : అది పొరపాటా లేదా కావాలని చేసిందా..అంపైరే ఆశ్చర్యపోయాడు ?
See Also : ఆ సినిమాలో పవర్ ఫుల్ ఫ్యాక్షన్ లీడర్గా విజయశాంతి.. కళ్ళు చెదిరే పర్ఫార్మెన్స్