తెలుగు సినీ నటి, నిర్మాత మరియు రాజకీయ నాయకురాలు విజయశాంతి . మొన్నటిదాకా రాజకీయ కార్యక్రమాలతోనే బిజీ బిజీగా ఉన్న విజయశాంతి సడెన్గా మహేష్ 26 లో నటించనుందని కన్ఫర్మ్ కావడంతో ప్రేక్షకుల్లో ఆసక్తి మొదలైంది. ఇన్నేళ్ల తర్వాత రాములమ్మ తిరిగి కెమెరా ముందుకొస్తోందంటే.. ఖచ్చితంగా తనదైన శైలిలో పాత్ర పరిధి ఉంటుందని ఫిక్సయ్యారు ప్రేక్షకులు. ఈ సందర్భంగా తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న విజయశాంతి. మూడున్నర దశాబ్దాల సినీ ప్రయాణం చేసి అశేష అభిమాన వర్గాన్ని సొంతం చేసుకున్న విజయశాంతి జీవితంలో ఎన్నో ఆటుపోట్లు ఉన్నాయట. ఉదయాన్నే నిద్రలేచి స్నానం చేయడం మొదలు నిర్విరామంగా, కంటి మీద కునుకు లేకుండా విజయశాంతి పడ్డ కష్టాలు అన్నీ ఇన్నీ కావు. అయితే మళ్లీ దాదాపు 13 ఏళ్ల తర్వాత మహేష్ బాబు హీరోగా తెరకెక్కనున్న సరిలేరు నీకెవ్వరు సినిమాతో రీ ఎంట్రీ ఇస్తోంది విజయశాంతి. అనిల్ రావిపూడి దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమా ఇటీవలే ప్రారంభమైంది. ఈ సినిమాలో పవర్ ఫుల్ ఫ్యాక్షన్ లీడర్గా విజయశాంతి కళ్ళు చెదిరే పర్ఫార్మెన్స్ కనబర్చనుందని వార్తలు వినిపిస్తున్నాయి.
See Also : స్వరూపానందుడి మనస్సులో స్థానం సంపాదించుకున్న కరణ్ రెడ్డి.. ప్రత్యేక అభినందనలు.
See Also : వైఎస్ వివేకానందరెడ్డిని చంపిందెవరు?… పులివెందుల, జమ్మలమడుగు టీడీపీ నేతల్లో టెన్షన్…
See Also : బీజేపీలోకి టీడీపీ ఎమ్మెల్యేలు..ఆవేదనలో ఉపరాష్ట్రపతి వెంకయ్య
See Also : అది పొరపాటా లేదా కావాలని చేసిందా..అంపైరే ఆశ్చర్యపోయాడు ?