తెలుగు బిగ్ బాస్ సీజన్ 3 పార్టిసిపెంట్స్ ఎంపిక ఒక కొలిక్కి వచ్చినట్లుగా సమాచారం అందుతోంది. ఎంతో మంది పేర్లు పరిశీలించి.. పలువురిని సంప్రదించిన టీం కొందరిని ఫైనల్ చేసినట్లుగా తెలుస్తోంది. అధికారికంగా అయితే ఇప్పటి వరకు ఒక్కరి పేరు కూడా బయటకు రాలేదు. కాని అనధికారికంగా ఎంతో మంది పేర్లు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. బిగ్ బాస్ 3 పై ఇప్పటి వరకు ఎన్నో రకాల వార్తలు వచ్చాయి. అయితే ఈ సీజన్ కి హూస్ట్ ఎవరు అన్న విషయంపై కూడా ఎన్నో వార్తలు వచ్చినప్పటికీ కింగ్ నాగార్జున అని కన్ఫామ్ అయ్యింది. ఈ మద్యే ఓ ప్రోమో కూడా రిలీజ్ చేశారు. ఈ నెల మూడో వారంలో సీజన్ మొదలు కానుంది. 14 మంది కంటెస్టెంట్లుతో 100 రోజులు నడిచే ఈ హై డ్రామా ప్రేక్షకులలో ఉత్కంఠను రేకెత్తిస్తుంది. మరోవైపు బిగ్ బాస్ కంటెస్టెంట్లు వీరే అంటూ తెగ వార్తలు వస్తున్నాయి. తాజాగా మరో లీస్ట్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.
యాంకర్ శ్రీముఖి, హీరో తరుణ్, మాస్టర్ రఘు , సింగర్ హేమచంద్ర , గాయత్రి గుప్తా, ఉదయభాను , వరుణ్ సందేశ్ , టిక్ టాక్ ఉప్పల్ బాల్ , తీన్మార్ సావిత్రి (జ్యోతి) , హాస్యనటుడు వైవా హర్ష , జాహ్నవి ఉన్నారని తెలుస్తుంది . అంతే కాకుండా వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఎ పాల్ కూడా ఇందులో పాల్గొనబోతున్నరని తెలుస్తుంది . వీరే గనక ఇంటి సభ్యులు అయితే మాత్రం రచ్చ రచ్చే అంటున్నారు అభిమానులు. చూడాలి మరి ఏం జరుగుతుందో..!