జగన్ ప్రమాణస్వీకారం చేసిన అనంతరం అన్యాయాలకి,అక్రమాలకూ పాల్పడుతున్న ప్రతీఒక్కరిపై ఆక్షన్ తీసుకుంటున్నాడు.చిన్నా పెద్ద అని తేడా లేకుండా అందరిని ఒక ఆట ఆడుకుంటున్నాడు. జగన్ దెబ్బకు హేమాహేమీలు సైతం వణుకుతున్నారు. అంతేకాకుండా మాజీ సీఎం చంద్రబాబు నాయుడు కూడా జగన్ చేస్తున్న కార్యక్రమాలకు భయపడుతున్నాడు. ఎందుకంటే తాను అధికారంలో ఉన్నంతసేపు కోట్లు దోచుకున్నాడే తప్ప ఒక్క మంచి పని కూడా చెయ్యలేదని అర్దమైంది.ప్రస్తుతం జగన్ కరకట్ట పై ఉన్న అక్రమ కట్టడాలను ఒక్కొకటిగా కూల్చివేత మొదలుపెట్టాడు.ఇందులో చంద్రబాబు ఇల్లు కూడా ఉంది.అంతేకాకుండా ప్రభుత్వం ఆ ఇంటికి సంభందించి నోటిసులు కూడా పంపించింది.
దీంతో చంద్రబాబు ఒక కొత్త డ్రామా మొదలు పెట్టాడు..దీనికి రియాక్ట్ అయిన విజయసాయి రెడ్డి ఘాటుగా స్పందించాడు.ఎవరు సలహో ఇచ్చారో కాని తనను ఓదార్చేందుకు రోజుకు 300 మందిని చంద్రబాబు రప్పించుకుంటున్నారని, వచ్చిన వాళ్లు బాగా రిహార్సల్ చేసి యాక్షన్ ఇరగదీస్తున్నారని అన్నారు. దేశంలోనే సంపన్నుడైన రాజకీయ నేతను, ఇల్లు లేకపోతే మా ఇంటి కొచ్చి ఉండండయ్యా అనడం డ్రామా కాకపోతే మరేమిటి?అని ప్రశ్నించాడు.ప్రజావేదిక అనే రేకుల షెడ్డును హెరిటేజ్ కంపెనీ డబ్బుతో ఏమైనా కట్టారా లోకేశ్. మీరు, మీ ముఠా సభ్యులు తెగ ఆవేశ పడుతున్నారు అని లోకేష్ కు కూడా గట్టిగా సమాధానం ఇచ్చాడు. రూ.50 లక్షల విలువ చేయని తాత్కాలిక నిర్మాణానికి రూ.9 కోట్లు దోచుకు తిన్నది బయట పడిందనా మీ ఏడుపులు, కిరాయి మనుషులతో పరామర్శలు చేయిస్తున్నారని అన్నారు.ఆ రేకుల షెడ్డు ఒక హాస్పిటలో, బస్టాండో అయినట్టు బాబు గారి డ్రామా ఆర్టిస్టులు టీవీల ముందు ఆవేశపూరిత డైలాగులేస్తున్నారు. కిరాయి తీసుకున్నామనే సంగతి పక్కకు పెట్టి దానికి రూ.9 కోట్లు పెట్టారంటే ఎలా నమ్మాలయ్యా అని చంద్రబాబును ప్రశ్నించండి అని ఆయన ప్రజలకు సందేశం ఇచ్చారు.
ఆ రేకుల షెడ్డు ఒక హాస్పిటలో, బస్టాండో అయినట్టు బాబు గారి డ్రామా ఆర్టిస్టులు టీవీల ముందు ఆవేశపూరిత డైలాగులేస్తున్నారు. కిరాయి తీసుకున్నామనే సంగతి పక్కకు పెట్టి దానికి రూ.9 కోట్లు పెట్టారంటే ఎలా నమ్మాలయ్యా అని చంద్రబాబును ప్రశ్నించండి. ప్రజాధనానికి జవాబు చెప్పాల్సింది ఆయనే.
— Vijayasai Reddy V (@VSReddy_MP) July 1, 2019
ఎవరు సలహో ఇచ్చారో కాని తనను ఓదార్చేందుకు రోజుకు 300 మందిని రప్పించుకుంటున్నారు బాబు. వచ్చిన వాళ్లు బాగా రిహార్సల్ చేసి యాక్షన్ ఇరగదీస్తున్నారు. దేశంలోనే సంపన్నుడైన రాజకీయ నేతను, ఇల్లు లేకపోతే మా ఇంటి కొచ్చి ఉండండయ్యా అనడం డ్రామా కాకపోతే మరేమిటి?
— Vijayasai Reddy V (@VSReddy_MP) July 1, 2019