తెలంగాణ రాష్ట్ర మాజీ డిప్యూటీ సీఎం ,టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కడియం శ్రీహారి గత కొద్ది రోజులుగా ఆ పార్టీకి గుడ్ బై చెప్పనున్నారు అని వార్తలు వచ్చిన సంగతి తెల్సిందే. ఈ క్రమంలో కడియం శ్రీహారి టీఆర్ఎస్ కు గుడ్
బై చెప్పి బీజేపీలో చేరనున్నారు అని ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ ,సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అయిన సంగతి విదితమే. తనపై వస్తున్న వార్తలపై కడియం శ్రీహారి స్పందించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ గత
కొన్ని రోజులుగా తాను టీఆర్ఎస్ పార్టీ వీడబోతున్నాను. ఆ పార్టీకి గుడ్ బై చెప్పి బీజేపీలో చేరబోతున్నాను అని వార్తలు వస్తున్నాయి. తన గురించి వస్తున్న ఇలాంటి ప్రచారంలో ఎటువంటి వాస్తవం లేదని ఆయన
తనపై జరుగుతున్న విషప్ర్తచారాన్ని ఖండించారు కడియం. ఆయన ఇంకా మాట్లాడుతూ “తను పార్టీ మారబోతున్నాను అని విషప్రచారం చేస్తోన్న పత్రికలు ,మీడియా తనకు క్షమపణాలు చెప్పాలని”డిమాండ్ చేశారు.
Tags bjp clarity Kadiyam Srihari rumours slider telanganacm telanganacmo trs