ప్రపంచకప్ లో భాగంగా ఈరోజు టీమిండియా బంగ్లాదేశ్ తో తలపడనుంది.ఇప్పటికే సౌతాఫ్రికా,వెస్టిండీస్, ఆఫ్ఘానిస్తాన్,శ్రీలంక ఇంటిమోకం పెట్టిన విషయం అందరికి తెలిసిందే.ఇప్పటిదాకా భారత్ 7మ్యాచ్ లు ఆడగా 11పాయింట్స్ తో రెండవ స్థానంలో ఉంది.ఈరోజు గెలిస్తే 13పాయింట్స్ తో ఇండియా సెమీస్ చేరుకుంటుంది.ఈరోజు బంగ్లాదేశ్ ఓడిపోతే మాత్రం ఇంటికి వెళ్ళాల్సిందే.అలాకాకుండా ఈరోజు గెలిస్తే ఆ టీమ్ కి కూడా అవకాశాలు ఉంటాయి.ఇక 2007లో గట్టి జట్టు ఐన భారత్ ను లీగ్ దశలోనే ఓడించింది బంగ్లాదేశ్.దానికి ప్రతీకారంగా ధోని సారధ్యంలో 2011,2015 ప్రపంచకప్ లో బంగ్లాదేశ్ ను చిత్తుగా ఓడించింది.మరి ఈరోజు కూడా ఓడిస్తుందా లేదా అనేది మరికొన్ని గంటలు వేచి చూడాల్సిందే.