Home / 18+ / చంద్రబాబు వాళ్లనే పట్టించుకోలేదు.. ఇప్పుడు మిమ్మల్ని ఆదుకుంటాడనుకోవడం కచ్చితంగా ఆశ్చర్యమే

చంద్రబాబు వాళ్లనే పట్టించుకోలేదు.. ఇప్పుడు మిమ్మల్ని ఆదుకుంటాడనుకోవడం కచ్చితంగా ఆశ్చర్యమే

తాజా ఎన్నికల్లో ఎదురైన ఘోర ఓటమినుండి ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ ఇంకా కోలుకోలేదు.. పైగా కొన్ని భ్రమలనుంచి టిడిపి ఇంకా బయటపడలేదు. పైగా టీడీపీ ఘోర ఓటమి ప్రభావం టిడిపి నేతలపై బాగా తీవ్రంగా పడినట్లు తెలుస్తోంది. అయితే సోషల్ మీడియాలో టిడిపి అభిమానులు మానసికంగా బాగా ఇబ్బందులు పడుతూ దారుణమైన విమర్శలు చేస్తున్నారు. తాజాగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డితోపాటు హోంమంత్రి మేకతోటి సుచరితపైన సోషల్ మీడియాలో దారుణమైన పోస్టులు పెడుతున్నారు. ఫేస్ బుక్ లో సీఎం జగన్ పై, సుచరితలపై అభ్యంతరకరమైన పోస్టులు పెడుతున్నారు. తాజాగా గుంటూరు జిల్లా మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి డిజిపి గౌతమ్ సవాంగ్ ను కలిసి ఫిర్యాదు కూడా చేశారు.. అలాగే రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో చాలామంది ఇదే విధంగా పేట్రేగిపోయారు.. అలాగే వైసీపీ శ్రేణులు, కొందరు నెటిజన్లు వారిపై ఫిర్యాదులు కూడా చేసారు. అయితే కొందరు టీడీపీ అత్యుత్సాహ కార్యకర్తలు చేసిన కామెంట్లు దుమారాన్ని రేపుతున్నాయి.

గతంలో దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డికి హెలికాప్టర్ ప్రమాదం జరిగినట్లే జగన్ కు కూడా హెలికాప్టర్ ప్రమాదం జరగాలని టీడీపీ మహిళా కార్యకర్తలు కూడా ఫేస్ బుక్ లో పోస్టులు పెట్టారు. జగన్ పై వారికి కోపం ఉండొచ్చు. చంద్రబాబుపై ప్రేమ ఉండొచ్చు.. అంతమాత్రాన జగన్ హెలికాప్టర్ ప్రమాదంలో మరణించాలని కోరుకుంటారా.? గతంల చంద్రబాబు అధాకారంలో ఉన్న కాలంలో ఆయనకు ప్రమాదం జరగాలని ఎవరైనా కోరుకున్నారా.. ఇప్పుడు హోంమంత్రి సుచరితను రేప్ చేస్తామంటూ పోస్టులు పెట్టటం పచ్చపార్టీ నేతల పైత్యం తీవ్రస్ధాయికి చేరుకుంది. వెంటనే ఫిర్యాదులు చేయడం వారిని అరెస్ట్ చేయడం జరిగింది. అయితే వందలకోట్లు డబ్బులు తీసుకుని, ఆ పదవులు ఈ పదవులు ఇస్తామని చెప్పి పార్టీ నాయకులనే మోసం చేసిన చంద్రబాబు వీరికి అండగా ఉంటారనుకోవడం నిజంగా ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat