Home / SLIDER / మీకు అండగా నేనున్నాను

మీకు అండగా నేనున్నాను

విధి ఆడే వింత నాటకం లో ఆ కుటుంభం అష్టకష్టాలపాలైంది.మద్దిరాల కు చెందిన తొట్ల స్వాతి అనే యువతి తండ్రి చిన్ననాడే చనిపోవడం తో ఆమె కుటుంభం 10 సంవత్సరాల క్రితమే పొట్టకూటి కోసమే సూర్యాపేట కు వచ్చింది..స్వాతి అక్క పుట్టుక నుండే అంగ వైకల్యం తో పాటు మానసిక వికలాంగురాలు.స్వాతి ని ఆమె తల్లి నే కూలీ నాలి చేసుకుంటూ చదివించింది.. డిగ్రీ ఫైనలియర్ చదువుతున్న స్వాతి చదువు తరువాత ఎదో ఒక ఉద్యోగం చేసి కుటుంబానికి ఆసరా గా ఉంటుందని భావించిన ఆ కుటుంభం ను విధి మరోసారి వెక్కిరించింది.
 
ఒక్కసారిగా అనారోగ్యానికి గురైన స్వాతి ని నిమ్స్ ఆసుపత్రి కి తీసుకువెల్లగా మస్కులర్ డిస్ట్రాపి (కండర క్షీణత ) అనే అరుదైన జెనిటిక్ వ్యాధి సోకిందని తేల్చారు.క్రమంగా నడవలేని స్థితికి వచ్చి మంచాన పడేయడం, తరువాత ప్రాణాలు హరించడం ఈ వ్యాధి లక్షణం.అయితే ప్రస్తుతం నడవలేని స్థితి లో ఉన్న స్వాతి తన తల్లి , మానసిక వికలాంగురాలైన తన అక్క తో కలిసి సూర్యాపేట క్యాంపు ఆఫీస్ లో మంత్రి జగదీశ్ రెడ్డి గారిని కలిసేందుకు వచ్చింది.. అయితే ఆటో దిగడానికి ఇబ్బంది పడుతున్న స్వాతి ని చూసిన మంత్రి జగదీశ్ రెడ్డి గారు.. తానే స్వయంగా వారి దగ్గరకు వెళ్లి కుర్చీలో కూర్చోబెట్టి ,తాను నిలుచుని దాదాపు 40 నిమిషాలతో పాటు వారి ఇబ్బందులను తెలుసుకున్నారు..
 
ఇబ్బందులను తెలుసుకోవడం తో పాటు, వెంటనే స్వాతి కి పెన్షన్, ఆమె కుటుంబానికి డబుల్ బెడ్ రూమ్ ఇల్లు మంజూరు చేయడం తో పాటు, స్వాతి వ్యాధి కి పెరగా కుండా ఉండేందుకు కావాల్సిన ప్రోటీన్ మెడిసిన్స్ అందజేయాలని అధికారులను ఆదేశించారు..దీంతో తమ ఇబ్బందులను తెలుసుకుని తమ పట్ల సానుకూలంగా స్పందించిన మంత్రి గారికి స్వాతి కుటుంభ సభ్యులు ధన్యవాదాలు తెలిపారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat