నవ్యాంధ్ర ముఖ్యమంత్రి,వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి ఆ పార్టీ శ్రేణులకు శుభవార్తను తెలిపారు.ఈ క్రమంలో ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో గెలుపొందిన పలువురు వైసీపీ ఎమ్మెల్యేలకు నామినేటేడ్
పదవులను ప్రకటించారు సీఎం జగన్.. ఈ క్రమంలో పలు కీలక బోర్డులకు చైర్మన్లను సీఎం ఖరారు చేశారని సమాచారం.
వైసీపీ శ్రేణులు చెబుతున్న సమాచారం మేరకు.. మహిళా కమీషన్ ఛైర్ పర్షన్ గా వాసిరెడ్డి పద్మ,సీఆర్డీఏ ఛైర్మన్ గా మంగళగిరి నుంచి నారా లోకేశ్ నాయుడుపై గెలుపొందిన అళ్ల రామకృష్ణారెడ్డి,ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పోరేషన్ ఛైర్మన్ గా సీనియర్ నటుడు,హీరో ,నిర్మాత మంచు మోహాన్ బాబు,ప్రాంతీయ బోర్డు ఛైర్మన్ గా తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డిను నియమించనున్నట్లు సమాచారం..
పోలీస్ హౌజింగ్ కార్పోరేషన్ ఛైర్మన్ గా యేసురత్నం,కాపు కార్పోరేషన్ ఛైర్మన్ గా గ్రంథి శ్రీనివాస్ లేదా కొత్తపల్లి సుబ్బరాయుడు,ఆర్టీసీ ఛైర్మన్ గా సత్తెనపల్లి ఎమ్మెల్యే అంబటి రాంబాబు,బ్రాహ్మణ కార్పోరేషన్ ఛైర్మన్ గా ద్రోణం రాజు శ్రీనివాస్,సివిల్ సప్లైస్ కమీషన్ ఛైర్మన్ గా ఆమంచి కృష్ణమోహాన్ ,ఎస్సీ ఎస్టీ కమీషన్ ఛైర్మన్ మోషేస్ రాజు,వక్ఫ్ బోర్డు ఛైర్మన్ గా మహ్మద్ ముస్తఫాలను నియమించనున్నట్లు వార్తలు వస్తున్నాయి.