Home / 18+ / జిల్లావ్యాప్తంగా చర్చ.. ఫోన్ చేసి చెప్పి మరీ చంపేసారంటూ అనుచరుల ఆందోళన

జిల్లావ్యాప్తంగా చర్చ.. ఫోన్ చేసి చెప్పి మరీ చంపేసారంటూ అనుచరుల ఆందోళన

గుంటూరు జిల్లాలోని చేబ్రోలులో దారుణం చోటుచేసుకుంది. వేజెండ్ల వద్ద కోటయ్య అనే వైసీపీ దళిత నాయకుడు దారుణ హత్యకు గురయ్యారు. ఓ మహిళతో కలిసి బైక్ వెళ్తుండగా అడ్డుకున్న దుండగులు కోటయ్య గొంతు కోసి పరారయ్యారు. తాడికొండ నుంచి తెనాలి బైక్‌పై వెళ్తుండగా ఈఘటన చోటుచేసుకుంది. కోటయ్య బైక్‌ పై వెళ్తుండగా సుమోలో వెంబడించిన దుండగులు ఈ హత్యకు పాల్పడ్డారు. స్థానికుల సమాచారం మేరకు ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కోటయ్య గతంలో ఎమ్మార్పీఎస్‌లో క్రియాశీలకంగా పని చేశారు. అతనిపై పలు ఉద్యమాలకు సంబంధించిన కేసులు పోలీస్‌స్టేషన్లలో ఇప్పటికే నమోదయ్యాయి. అయితే కోటయ్య వైసీపీకి మద్దతుదారునిగా ఉన్నారు. అయితే పాత కక్షలకు తోడు రాజకీయ కక్ష కూడా ఇందుకు కారణంగా చెప్తున్నారు. అయితే కోటయ్య ను కోల్పోవడం చాలా బాధగా వుందని ఆయన సహచరులు చెప్తున్నారు. కొన్ని నెలలక్రితం చేతికి అంది వచ్చిన కొడుకును, మంచి ప్రతిభావంతుడైన డాక్టర్ అవ్వాల్సిన తన అబ్బాయిని ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు హత్యచేసి చంపారు.. ఇప్పుడు మళ్లీ కోటయ్య మహరాజ్ ను కిరాతకంగా హత్య చేసారు.

కోటయ్య మాదిగ రిజర్వేషన్ పోరాట సమితిలో చురుగ్గా పాల్గొని ఎన్నో ఉద్యమాలు చేసారు. దళిత సామాజికవర్గ అభివృద్ధి గురించి వారిలో చైతన్యం తీసుకురావడానికి కృషి చేసారు. ఇటీవల కోటయ్య తన నాన్న సమాధి ప్రక్కనే వాళ్ళ అబ్బాయి సమాధి కట్టి తరువాత సమాధి నాదే కావచ్చు అని అందరితో అన్నారట.. గతంలోనూ ఒకసారి తెనాలిలో కోటయ్యను చంపడానికి ప్రత్యర్థులు ప్రయత్నించగా ముస్లిం సోదరులు కోటయ్యకు అండగా నిలిచినట్టు అక్కడి స్థానికులు చెప్తున్నారు. అయితే కోటయ్య హత్యపై తెలుగుదేశం శ్రేణుల ప్రమేయం ఉన్నట్టు బలమైన వాదనలు వినిపిస్తున్నాయి. ఆయన సన్నిహితులు కూడా సోషల్ మీడియా వేదికగా ఇదే అంశాన్ని వ్యక్తపరుస్తున్నారు. పమిడిపాటి అన్నను టీడీపీ అతి దారుణంగా హత్య చేయించిందని చెప్తున్నారు. అలాగే ఆయనను చంపుతున్నాం అని అనుచరులకి ఫోన్ చేసి చెప్పి మరీ టీడీపీ నాయకులు చంపేసారని విమర్శిస్తున్నారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat