టాస్ గెలిచి బ్యాటింగ్కు దిగిన శ్రీలంకకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్ పెవిలియన్ చేరడంతో మిడిలార్డర్ క్రికెటర్లు మాథ్యూస్, తిరుమానె నిలకడగా ఆడుతున్నారు. జట్టుకు గౌరవప్రదమైన
స్కోరు అందించేందుకు ఈ జోడీ సంయమనంతో బ్యాటింగ్ చేస్తోంది. ఎలాంటి భారీ షాట్లకు పోకుండా సింగిల్స్ తీస్తూ స్ట్రైక్ రొటేట్ చేస్తున్నారు. ఎట్టకేలకు శ్రీలంక 24వ ఓవర్లో 100 పరుగుల మార్క్ దాటింది. ప్రమాదకరంగా మారిన ఈ జోడిని విడదీసేందుకు బౌలర్లు శ్రమిస్తున్నారు. భారీ షాట్లకు పోకుండా కేవలం సింగిల్స్కే ప్రాధాన్యం ఇస్తున్నారు. కుల్దీప్, జడేజా కట్టుదిట్టంగా బంతులేయడంతో ఆచితూచి ఆడారు. 29 ఓవర్లు పూర్తయ్యేసరికి 4 వికెట్లకు 122 పరుగులు చేసింది. మాథ్యూస్(38), తిరుమానె(29) ఇన్నింగ్స్ను చక్కదిద్దుతున్నారు.
Tags ICC Cricket World Cup IND India lanka ms done SL slider sports Sri Lanka virat kohli