అధికారం పోయింది. ప్రజలు దారుణంగా ఛీ కొట్టారు. కేంద్రంలో లెక్కచేసేవారు లేరు.. ప్రతిపక్ష పాత్ర పోషించి ప్రజలకోసం పోరాడాలనే ఆలోచన లేదు.. ప్రస్తుత ముఖ్యమంత్రి పాలనలో ఆ అవకాశం లేదు. విమర్శించే వీలు లేదు. దాంతో తనకుతానే ఓదార్పులు చేయించుకుంటూ, ప్రజల్లో సానుభూతి పొందేందుకు తంటాలూ పడుతున్నారు మాజీ సీఎం చంద్రబాబు. నలభై ఏళ్ల అనుభవంతో ప్రజల్లో జాలి పొంది ఏదో లాభం పొదాలని ప్రయత్నిస్తున్నారు. తాజాగా తనకు సెక్యూరిటీ తగ్గిస్తున్నారంటూ ప్రచారం చేసారు. ఇప్పుడు తనపై దాడి జరిగితే రాష్ట్రాన్ని కంట్రోల్ చేయలేరంటూ స్వయంగా చంద్రబాబే చెప్తున్నారు.
ఇది కుట్రగా కనిపిస్తోందని వైయస్సార్ కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు. టీడీపీ కార్యకర్ిలను రాష్ట్రంలో అలజడులు, అల్లర్లు సృష్టించేందుకు బాబు సమాయత్తం చేస్తున్నట్టుగా నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి. చంద్రబాబుపై చిన్నపాటి దాడి లాంటిది జరగడం దాన్ని భద్రతా వైఫల్యంగా ప్రచారం చేస్తూ, టీడీపీ శ్రేణులు రాష్ట్రంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా గొడవలు చేయడం ఈ ప్లాన్ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారట. గతంలో జగన్ ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో విశాఖ విమానాశ్రయంలో హత్యాయత్నం జరిగినప్పుడు విపరీతమైన వెకిలిగా వాఖ్యలు చేసి, వైఎస్సార్ కాంగ్రెస్ అభిమానులను రెచ్చగొట్టేందుకు ప్రయత్నించారు. కానీ జగన్ తన అభిమానులను సంయమనంతో ఉండాలని అల్లర్లూ జరగకుండా జాగ్రత్తలు తీసుకున్నారు.
వివేకానందరెడ్డి హత్యోదంతంలోనూ చంద్రబాబు, టీడీపీ నేతలు ఇలాగే వాఖ్యలు చేసారు. తుని రైలు సంఘటనలోనూ రాయలసీమ రౌడీలు అంటూ మాట్లాడిన చంద్రబాబు దీనిపై అల్లర్లు రేగితే వాటిని వైసీపీ ఖాతాలో వేయాలనుకున్నారు. వైసీపీపై ఫాక్షనిష్టుల ముద్ర వేసి ప్రజల్లో వ్యతిరేకత కలిగించాలని పన్నాగం పన్నారు. కానీ చంద్రబాబు ఊహించినట్టు జరగలేదు. జగన్ మాట మేరకు కార్యకర్తలు, అభిమానులు, సానుభూతిపరు ఎవ్వరూ ఇప్పటివరకూ చంద్రబాబు ట్రాప్ లో పడలేదు. రాష్ట్రంలో ఎప్పుడూ శాంతి భద్రతలకు విఘాతం కలిగించలేదు