తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి,అధికార టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తనయ,నిజమాబాద్ మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత గులాబీ పార్టీ క్రియాశీలక సభ్యత్వం తీసుకున్నారు. అందులో భాగంగా మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్లోని హైటెక్స్ లో మాజీ ఎంపీ కవిత నివాసంలో కలిసి పార్టీ సభ్యత్వం పత్రాలను అందజేశారు.
అనంతరం మంత్రి ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ”రాష్ట్ర వ్యాప్తంగా మరియు నిజామాబాద్ జిల్లాలో సభ్యత్వ నమోదు కార్యక్రమం చాలా చురుగ్గా సాగుతుంది.. పార్టీ నిర్దేశించిన లక్ష్యము కంటే ఎక్కువ సభ్యత్వ నమోదు అవుతుంది.. ప్రజల్లో టి.ఆర్.ఎస్ పార్టీ పట్ల ,సీఎం కేసీఆర్ నాయకత్వం పట్ల పూర్తి విశ్వాసం ఉందనడానికి ఇది నిదర్శనం అని ఆయన అన్నారు..
తెలంగాణ హక్కులు కాపాడటం ప్రజల ప్రయోజనాలు నెరవేర్చడం ఒక్క టీఆర్ఎస్ పార్టీ తోనే సాధ్యం.. అందుకే పార్టీ పై ప్రజల్లో ఉన్న నమ్మకం తోనే పెద్ద ఎత్తున ప్రజలు పార్టీ సభ్యత్వం తీసుకుంటున్నారని మంత్రి ఈ సందర్భంగా అన్నారు..