Home / ANDHRAPRADESH / టీడీపీకి షాక్ న్యూస్..ఎమ్మెల్సీ పదవికి రాజీనామా..త్వరలో వైసీపీలో చేరిక

టీడీపీకి షాక్ న్యూస్..ఎమ్మెల్సీ పదవికి రాజీనామా..త్వరలో వైసీపీలో చేరిక

ఆంధ్రప్రదేశ్ లో ప్రతి పక్షంలో ఉన్న తెలుగుదేశం పార్టీకి మరో ఎదురు దెబ్బ తగిలింది. ఆ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ఎమ్మెల్సీ అన్నం సతీష్ కుమార్ ప్రకటించారని వార్త వచ్చింది. పాతికేళ్లుగా తాను పార్టీలో ఉన్నానని, ఇంతకాలం తనను ప్రోత్సహించినవారికి , ఆదరించినవారికి దన్యవాదాలు తెలుపుతున్నానని ఆయన పేర్కొన్నారు.ఆత్మ ప్రబోధానుసారమే ఎమ్మెల్సీ పదవికి కూడా రాజీనామా చేస్తున్నట్టు సతీశ్‌ ప్రకటించారు. అయితే, ఆయన ఏ పార్టీలో చేరతారు?భవిష్యత్‌ కార్యాచరణ ఏమిటనేది ఇంకా తెలపలేదు. ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారంటే బహుశా అదికార వైసిపి వైపు చూస్తున్నారా?లేక బిజెపిలో చేరతారా అన్నది తేలవలసి ఉంది. ఎక్కువగా వైసీపీలో చేరుతారని జోరుగా ప్రచారం జరుగుతుంది.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat