కాంగ్రెస్ మాజీ ఎంపీ ,టాలీవుడు సీనియర్ స్టార్ హీరో కొణిదెల చిరంజీవి ఈ రోజు శుక్రవారం నవ్యాంధ్ర రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబును కలిశారు.ఈ క్రమంలో మంత్రి కన్నబాబు సోదరుడు సురేష్ గుండెపోటుతో హఠాన్మరణం చెందిన సంగతి తెలిసిందే. దీంతో సురేష్ మరణంతో కురసాల ఇంట విషాదం నెలకొంది.దీనికారణంగానే మంత్రి కన్నబాబు బడ్జెట్ సమావేశాలకు కూడా హాజరుకాలేకపోయారు.
నేడు సురేష్ అంత్యక్రియలు జరగనున్నాయి. ఈ సందర్భంగా సోదర వియోగంతో బాధపడుతున్న కురసాల కన్నబాబును మాజీ ఎంపీ మెగాస్టార్ చిరంజీవి పరామర్శించారు.అయితే మంత్రి గతంలో అంటే అప్పటి ఉమ్మడి ఏపీలో జరిగిన 2009 సార్వత్రిక ఎన్నికల్లో ప్రజారాజ్యం తరఫున పోటీ చేసి విజయం సాధించిన సంగతి తెలిసిందే. అప్పట్లో ప్రజారాజ్యంలో కురసాల కీలకనేతగా కూడా వ్యవహరించారు.