ప్రపంచం జనాభా దినోత్సవం ను పురస్కరించుకుని సహజ జనానాలను ప్రోత్సహిస్తూ NO Cesarean Delivery అనే నినాదంతో తమ సంస్థ లోగోను ఈ రోజు హైటెక్ సిటీలోని పోనిక్స్ ఆరిన ఆర్ట్ కల్చరల్ ప్రాణoగములో తెలంగాణ రాష్ట్ర ప్రత్యేక అధికారి డా: వేణుగోపాలచారి చేతుల మిదుగా ఆవిష్కరించారు.ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో సిజేరియన్ ఆపరేషన్లు తగ్గించేందుకు ప్రభుత్వం కేసీఆర్ బేబీ కీట్స్ పంపిణీ చేయడం వలన ప్రభుత్వ హాస్పిటల్స్ నందు డెలివరీల సంఖ్య మరింత పెరిగింది అని అన్నారు.అనంతరం వెల్ టెక్ ఫౌండేషన్ చైర్మన్ చిలుపూరి వీరాచారి గారు మాట్లాడుతూ ప్రపంచ దేశాలతో పోలిస్తే భారతదేశంలో సిజేరియన్ ఆపరేషన్ లు ఎక్కువగా ఉన్నాయన్నారు.
ప్రజలలో అవగాహన కల్పించడం ద్వారా వీటిని అరికట్టే ప్రయత్నం చేస్తామన్నారు.లక్ష్మణ్ రూడవత్ మాట్లాడుతూ మన రాష్ట్రంలోనే సిజేరియన్లు ఎక్కువ సహజంగా కాన్పు అయితే ప్రస్తుతం విచిత్రంగా చూస్తున్నారన్నారు. కొంత మంది బిడ్డ పుట్టక ముందే జోతిష్యులను సంప్రదించి బిడ్డ ఎప్పుడు, ఏ సమయంలో పుట్టాలో నిర్ణయిం చుకుంటున్నారని, ఇది మంచి పద్ధతి కాదు.. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ప్రభుత్వాస్పుత్రుల్లో మౌలిక వసతులు కల్పించడమే కాకుండా సౌకర్యాలు పెంపొందించాలి.. సిజరేషన్లు కాకుండా సహజ కాన్పులు చేసే దిశగా చర్యలు చేపట్టాలి. సిజేరియన్ ఆపరేషన్లు నాగాలాండ్లో 5.8శాతం, బీహర్లో 6.2శాతం, పంజాబ్లో 24.6శాతం, తమిళనాడులో 34.1, కేరళలో 35.8 శాతం అవుతుండగా తెలంగాణలో మాత్రం 57.7శాతం అవుతున్నాయి.
సహజకాన్పులు, సామాజిక బాధ్యత అని, ఇటీవల సిజేరియన్లు పెరిగిపోతున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు దేశవ్యాప్తంగా మన రాష్ట్రంలో సిజేరియన్లు ఎక్కువగా జరుగుతున్నాయని, ఇది మహిళలపై త్రీవ ప్రభావం చూపుతోందని వారు పేర్కొన్నారు.రాష్ట్రాల వారీగా లెక్కలు చూస్తే సిజేరియన్ల సంఖ్య క్రమక్రమంగా పెరుగుతోందన్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసూతీ గదులు సరిగా లేకపోవడంతో చాలా మంది ప్రసవ సమయంలో నొప్పులు భరించలేక సిజేరియన్లవైపు మొగ్గుచూపుతున్నారు.ప్రసవం చేయడంలో మిడ్ వైవ్స్, నర్సులదే కీలక పాత్ర , కానీ ప్రస్తుతం సిజేరియన్ల పేరుతో వైద్యులే ఈ భాధ్యత తీసుకుంటున్నారు.సహజకాన్పుకు 18 నుంచి 24 గంటల సమయం పడుతుండగా, సిజేరియన్ మాత్రం కేవలం 2 నుంచి 3 గంటల సమయం పడుతుంది.
ఒకసారి సిజేరియన్ జరిగితే, మరో గర్భంలో కూడా సిజేరియన్ తప్పనిసరి అని గుర్తుంచుకోవాలి.సహజకాన్పులు సామాజిక బాధ్యత అని అందరూ భావించాలి ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఐదుగురు రోగులకు ఒక నర్సు, టీచింగ్ ఆస్పత్రుల్లో ముగ్గురు రోగులకు ఒక నర్సు ఉండాల్సి ఉండగా ఆ సంఖ్యకు తగ్గట్లుగా ఉండడం లేదు.. కొంత కాలంగా (2011 నుండి నేటి వరకు) ప్రభుత్వం నర్సింగ్ పోస్టులు భర్తీ చేయడం లేదు .ఈ కార్యక్రమంలో నర్సింగ్ ఆఫీసర్స్ అసోసియేషన్ వ్యవస్థకులు లక్ష్మణ్ రూడవత్ గారి, గీతం ఫౌండేషన్ చైర్మన్ రామ్ తిలక్ గారు, మొదలగు వారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
మాతో కలిసి వచ్చేవారు 7207347575 ఈ ఫోన్ నంబర్ కు మిస్ డ్ కాల్ చేయండి