Home / 18+ / రాష్ట్రాన్ని దివాలా తీయించింది చంద్రబాబే..విజయసాయి రెడ్డి

రాష్ట్రాన్ని దివాలా తీయించింది చంద్రబాబే..విజయసాయి రెడ్డి

2014 ఎన్నికల సమయంలో చంద్రబాబు తప్పుడు హామీలు ఇచ్చి గెలిచిన విషయం అందరికి తెలిసిందే.ప్రజల నమ్మకంతో ఆడుకున్న బాబూ ఎన్నికల్లో గెలిచిన తరువాత అందరికి చుక్కలు చూపించాడు.ఇచ్చిన హామీలు విషయం పక్కన పెడితే చిన్న చిన్న పనులకు కూడా లంచాలు ఇస్తేనే కాని ఏ పని జరిగేది కాదు.ఆంధ్రా ప్రజలన్ని పిచ్చివాళ్ళని చేసి వేల కోట్లు నోక్కేసాడు.ఈ ఐదేళ్ళ పాలనతో విసిగిపోయిన ప్రజలు,ఈ 2019 ఎన్నికల్లో బాబుకు సరైన బుద్ధి చెప్పారు. వైఎస్ఆర్ తనయుడు వైఎస్ జగన్ పై నమ్మకం పెట్టుకొని భారీ మెజారిటీతో గెలిపించారు.ఈ మేరకు జగన్ కూడా తనని గెలిపించిన ప్రజలకు పూర్తి స్థాయిలో న్యాయం చేస్తున్నారు.ఇక వైసీపీ సీనియర్ నేత విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేదికగా చంద్రబాబుపై ధ్వజమెత్తారు.ఒక్క సాగునీటి ప్రాజెక్టు పూర్తి చేయలేదు. ప్రపంచంలోనే ఐదో పెద్ద సిటీ చేస్తామన్న అమరావతి గ్రాఫిక్స్ దశలోనే వదిలేసారు. విచ్చల విడిగా అప్పులు తెచ్చి రాష్ట్రాన్ని దివాలా తీయించారని అన్నారు. కార్పోరేషన్లు, ప్రభుత్వ సంస్థల ద్వారా రుణంగా తెచ్చిన లక్ష కోట్లు ఏమయ్యాయో అంతుబట్టడం లేదని ప్రశ్నించారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat