తెలంగాణ వరప్రదాయిని కాళేశ్వరం గోదావరి జలాలతో కళకళలాడుతుంది. ఈ క్రమంలో ప్రాజెక్టు పరిధిలోని మేడిగడ్డ బరాజ్లోని నీటిని ఎత్తిపోసేందుకు కన్నెపల్లి పంప్హౌస్లో మరో మోటర్ ఆరంభమయింది. పంప్హౌస్ నుంచి శనివారం వరకు నాలుగు మోటర్ల ద్వారా నీటిని ఎత్తిపోయగా.. ఆదివారం ఐదోమోటర్ అందుబాటులోకి వచ్చింది. నిన్న శనివారం రాత్రి ఇంజినీర్లు ఐదో నంబర్ మోటర్ను ప్రారంభించి నిరంతరాయంగా నడిపించారు.
శుక్రవారం సాయంత్రం నిలిపివేసిన ఒకటోనంబర్ మోటర్ను ఆదివారం సాయంత్రం ఆన్చేయడంతో మొత్తం ఐదు మోటర్లు నిరంతరాయంగా గోదావరి నీటిని ఎత్తిపోస్తున్నాయి. కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టు ప్రారంభమైన తర్వాత కన్నెపల్లి పంప్హౌస్లో ఒకేసారి ఐదు మోటర్లు నిర్విరామంగా నడవడం ఇదే ప్రథమం.
niMఐదుమోటర్ల ద్వారా రోజుకు 10,500 క్యూసెక్కుల నీరు అన్నారం బరాజ్కు తరలుతున్నది. అటు మేడిగడ్డ, ఇటు అన్నారం బరాజ్ల్లో నీటి నిల్వలు అంతకంతకూ పెరుగుతున్నాయి. మేడిగడ్డలో నీటి నిల్వ 6 టీఎంసీలకు చేరగా.. కన్నెపల్లి నుంచి ఎత్తిపోసిన నీటితో అన్నారం బరాజ్లో 4 టీఎంసీల నీటి నిల్వచేరింది. అన్నారం బరాజ్ నుంచి బ్యాక్వాటర్ ఆదివారం మంథని మండలంలోని పోతారం వరకు చేరుకున్నాయి. మరో రెండున్నర కిలోమీటర్లు విస్తరిస్తే కాసిపేటలోని అన్నారం పంప్హౌస్ను జలాలు
తాకనున్నాయి.