ఏపీ ప్రభుత్వం మంత్రివర్గంలో పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. కౌలు రైతులకు సాగు ఒప్పందం కుదుర్చుకునేందుకు వీలు కల్పించేలా రూపొందించిన బిల్లుకు ఆమోదం.. భూ యజమానులకు నష్టం రాకుండా రూపొందించిన బిల్లు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. భూముల రికార్డులను భవిష్యత్తులో ఎవ్వరూ టాంపర్ చేయకుండా, యజమానులకు శాశ్వత ప్రాతిపదికన హక్కులు కల్పించడానికి ఉద్దేశించిన ముసాయిదా బిల్లుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. భూ తగాదాలను తగ్గించేందుకు ల్యాండ్ టైటిల్ రిజిస్ట్రేషన్ సిస్టంలో మార్పులకు ఉద్దేశించిన ముసాయిదాకు ఆమోదించింది. మద్య నిషేధం దిశగా తొలిఅడుగు వేసి తొలిదశ చర్యలు ప్రారంభించారు. ఇకపై ప్రభుత్వం చేతికే మద్యం దుకాణాల నిర్వహణ చేస్తూ మసాయిదా బిల్లుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అలాగే ఆక్వా రైతులకు యూనిట్ కరెంటు రూ.1.50కే, కేబినెట్ ఆమోద ముద్ర వేసారు.
అలాగే గడువు తీరిన స్థానిక సంస్థల్లో ప్రత్యేకాధికారుల నియామకానికి ఆమోదముద్ర వేసారు. ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల తయారీ పార్కుకోసం చిత్తూరు జిల్లా ఏర్పేడు మండలం విక్రుతమాల గ్రామంలో ఏపీఐఐసీకి 149 ఎకరాలు అప్పగిస్తూ నిర్ణయించారు. అంగన్ వాడీ వర్కర్లకు రూ.11,500, మిని అంగన్ వాడీ వర్కర్లకు రూ.7వేలు, అంగన్ వాడీ హెల్సర్ కు రూ.7వేలు జీతాలు పెంచుతూ నిర్ణయాలు తీసుకున్నారు. జులై నుంచి ఈ పెంపుదల వర్తిస్తుంది. పరిపాలనలో విప్లవాత్మక మార్పుగా భావిస్తున్న గ్రామ సచివాలయాలు, గ్రామ వాలంటీర్ల వ్యవస్థకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ప్రతి యాభై కుటుంబాలకు ఒక వాలంటీర్ నియామకానికి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. వీరికి నెలకు రూ.5వేలు ఇచ్చేందుకు అంగీకారం, పంచాయతీరాజ్ శాఖకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పట్టణ ప్రాంతాల్లోనూ ఇదే తరహా వ్యవస్థకు కేబినెట్ ఆమోదం. దేవాదాయ శాఖ చట్టంలో మార్పులకు ఉద్దేశిస్తూ రూపొందించిన ముసాయిదా బిల్లుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.