Home / TELANGANA / చిట్ చాట్.. బీజేపీ పై కేటీఆర్ సెటైర్లు..!!

చిట్ చాట్.. బీజేపీ పై కేటీఆర్ సెటైర్లు..!!

అసెంబ్లీ సమావేశం అనంతరం అసెంబ్లీలోని టీఆర్ఎస్‌ఎల్పీలో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మీడియాతో చిట్ చాట్ చేశారు. ఈ సందర్భంగా మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్ఎస్ అగ్రస్థానంలో నిలుస్తుందని ధీమాను వ్యక్తం చేశారు. తెలంగాణలో బీజేపీ నాలుగు ఎంపీ సీట్లు గెలవగానే ఆగడం లేదని కేటీఆర్ సెటైర్లు వేశారు. బీజేపీ స్థానిక సంస్థల ఎన్నికల్లో కేవలం 8 జడ్పీటీసీ స్థానాలను మాత్రమే గెలుచుకొందని ఆయన గుర్తు చేశారు. రెండో స్థానం కోసం బీజేపీ, కాంగ్రెస్ ల మధ్య పోటీ ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. మంచి మున్సిపల్ చట్టం తెచ్చినప్పుడు కచ్చితంగా తమ పార్టీకే ప్రజలు పట్టం కడుతారరని ఆయన తెలిపారు. గత ఐదున్నర ఏళ్లలో ప్రజలకు ఉపయోగపడే అనేక చట్టాలు తెచ్చిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. కొత్త అసెంబ్లీ, సచివాలయం నిర్మాణం విషయంలో కేసు కోర్టులో ఉందని, ఈ విషయమై కోర్టు నిర్ణయం ఎలా ఉంటుందో చూద్దామన్నారు. జర్నలిస్టుల సమస్యను పరిష్కరించే బాధ్యతను తాను తీసుకొంటానని ఆయన ఈ సందర్భంగా ప్రకటించారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat