సీఎం కేసీఆర్ తో కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి భేటీ అయ్యారు. భేటీ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మునుగోడు నియోజకవర్గ పరిధిలోని భూనిర్వాసితుల సమస్యలు, ఉదయ సముద్రం ప్రాజెక్టు, మూసీ నది కాలువల వెడల్పునకు నిధులు కేటాయించాలని కోరుతూ సీఎంకు వినతిపత్రం అందజేసినట్టు చెప్పారు. డిండి ప్రాజెక్ట్ కింద ముంపునకు గురయ్యే మునుగోడు నియోజకవర్గ భూ నిర్వాసితులకు ఇప్పటివరకు నష్టపరిహారం అందలేదని విజ్ఞప్తి చేసినట్లు వివరించారు. శివన్నగూడెం, కృష్ణరాంపల్లి నిర్వాసితులకు కూడా మల్లన్న సాగర్ భూ నిర్వాసితులకు అందించిన ప్యాకేజీనే అందించాలని కోరినట్లు తెలిపారు. ఉదయసముద్రం , బ్రాహ్మణ వెల్లముల ప్రాజెక్టు పూర్తి చేయడానికి నిధులు కేటాయించాలన్నారు.