Home / 18+ / బూత్ లెవెల్ ట్రైనింగ్, కన్వీనర్ ప్రోగ్రామ్‌ లతో పార్టీ విజయానికి కృషి, గుర్తించిన జగన్

బూత్ లెవెల్ ట్రైనింగ్, కన్వీనర్ ప్రోగ్రామ్‌ లతో పార్టీ విజయానికి కృషి, గుర్తించిన జగన్

ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్‌ కార్పోరేషన్‌ ఛైర్మన్‌గా వైసీపీ నేత చల్లా మధుసూదన్‌రెడ్డిని నియమిస్తూ ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. వైయ‌స్ఆర్‌ సీపీ ఆవిర్భావం నుంచి మధుసూదన్ రెడ్డి పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరించారు. రాష్ట్రంలోని 13 జిల్లాల్లో బూత్ లెవెల్ ట్రైనింగ్, కన్వీనర్ ప్రోగ్రామ్‌ లను విజయవంతంగా నిర్వహించారు. అత్యంత ప్రతిష్టాత్మకమైన కార్యక్రమాలు చేసి పార్టీ విజయానికి ఎంతో కృషి చేశారు. పార్టీలో ఐటీ వింగ్‌ ప్రెసిడెంట్‌గా, రాష్ట్ర కార్యదర్శిగా పార్టీకి ఎనలేని సేవచేశారు. చల్లా ప్రజాసంక్షేమ కార్యక్రమాల్లో విస్తృతంగా పనిచేస్తూ, సమాజాభివృద్ధిపై అవగాహన కలిగివున్న వ్యక్తిగా చల్లా మధుసూదన్ రెడ్డిని ఈపదవిలో నియమించడం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతుంది. ఈమేర‌కు ప‌లువురు పార్టీ నేత‌లు చ‌ల్లా మ‌ధుసూద‌న్‌రెడ్డికి అభినంద‌న‌లు తెలిపారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat