హీరో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా జంటగా నటించిన చిత్రం `డియర్ కామ్రేడ్`. ఈ చిత్రం జూలై 26న తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో ఘనంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.దీనికి గాను భరత్ కమ్మ దర్శకత్వం వహించగా నవీన్ ఎర్నేని, యలమంచిలి రవిశంకర్, మోహన్ చెరుకూరి, యష్ రంగినేని సంయుక్తగా నిర్మిస్తున్నారు. ఈ సందర్భంగా శుక్రవారం చిత్ర యూనిట్ హైదరాబాద్లో మ్యూజిక్ ఫెస్టివల్ను నిర్వహించింది. ఈ కార్యక్రమంలో సినిమాలోని పాటలను లైవ్గా పదర్శించడమే కాకుండా, విజయ్ దేవరకొండ, రష్మిక స్టేజ్పై పాటలకు డ్యాన్సులు చేసి ప్రేక్షకులను అలరించారు.
ఈ మేరకు హీరో విజయ్ మాట్లాడుతూ ప్రతీ మనిషిలో భయం ఉంటుంది..దానిని వదిలేస్తేనే మనం గెలుస్తాం. నా విషయానికే వస్తే నేను హీరో అంటే నాకే భయమేసింది. మనకు కావాల్సిన దాని కోసం పోరాటం చేస్తేనే మనకి ఏదైనా దక్కుతుంది. అలాంటి విషయాన్నీ చెప్పే ప్రయత్నమే `డియర్ కామ్రేడ్` సినిమా అని అన్నాడు. ఇప్పటికే బెంగళూరు, కొచ్చి, చెన్నైల్లో మ్యూజిక్ ఫెస్టివల్స్ చేయడం జరిగింది. ప్రేక్షకులు ప్రతిచోటా మాకు ప్రేమనే పంచారు అని అన్నాడు.అదే విధంగా హీరోయిన్ రష్మిక మాట్లాడుతూ నేను సినిమాల్లోకి రావాలనుకుంటే చాలా మంది వద్దనే అన్నారు.కాని దీనికోసం నేను చాలా కష్టపడ్డాను,అందరిని ఒప్పించి చివరికి సాధించాను అను చెప్పింది.