ఏపీలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో అప్పటి అధికార పార్టీ ఐన టీడీపీ చేసిన అన్యాయాలకు, అక్రమాలకూ ప్రజలు సరైన బుద్ధి చెప్పారు.ఆ పార్టీ కేవలం 23సీట్లు తో సరిపెట్టుకుంది. సీనియర్ నాయకులు, మంత్రులు సైతం ఓటమిపాలయ్యారు. ఫ్యాన్ గాలి దెబ్బకు తెలుగు తమ్ముళ్ళు ఎగిరిపోయారు. అయితే ప్రస్తుతం టీడీపీ పరిస్థితి చాలా దారుణంగా ఉందని చెప్పాలి ఎందుకంటే గెలిచినవారి సంగతి పక్కన పెడితే..ఓడిన ఎమ్మెల్యేల పరిస్థితి మాత్రం చెప్పుకోలేనిదే.
జగన్ దెబ్బకు మాజీ మఖ్యమంత్రి చంద్రబాబు సైతం వణుకుతున్నాడు.ఇక మిగాతవాలు ఎలాగైన తప్పించుకోవాలనే ఆలోచనలతో పార్టీలు మారిపోతున్నారు. ప్రతిపక్ష పార్టీలో ఉంటే మనకి వచ్చేది ఏమీ ఉండదని అనుకుంటున్నారో ఏమో తెలిదు గాని చంద్రబాబు బుజ్జగించిన సరే లెక్కచేయకుండా వెళ్ళిపోతున్నారు. అయితే తాజాగా జిల్లాకు చెందిన టీడీపీ నాయకుడు ఒకరు ఆ పార్టీ నుండి విముక్తి పొంది బీజీపీలో చేరేందుకు సిద్దమైనట్లు తెలుస్తుంది. గుంటూరు జిల్లా నరసరావుపేటకు చెందిన డాక్టర్ చదలవాడ అరవిందబాబు ఆదివారం బీజేపీ రాష్ర్ట అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణతో భేటీ అయ్యారు.ఈయన గడిచిన ఎన్నికల్లో నరసరావుపేట నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీచేసి ఓడిపోయాడు.కన్నా లక్ష్మీనారాయణతో భేటీ అవడంతో ఆయన టీడీపీకి గుడ్ బై చెప్పి త్వరలోనే బీజేపీలో చేరబోతున్నారనే వార్తలు వస్తున్నాయి.