టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని ఆర్మీ బెటాలియన్లో శిక్షణ కొరకు భారత ఆర్మీ కి దరఖాస్తు పెట్టుకున్న విషయం తెలిసిందే. ఈ మేరకు భారత ఆర్మీ నుంచి గ్రీన్ సిగ్నల్ వచినట్లు తెలుస్తుంది. వెస్టిండీస్ టూర్ నుండి తనంతట తానే తప్పుకున్న ధోని..రెండు నెలల పాటు గౌరవ లెఫ్టినెంట్ కల్నల్ హోదాలో పారామిలటరీ రెజిమెంట్లో పనిచెయ్యాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు తాజాగా భారత ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్ ధోని దరఖాస్తును అంగీకరించినట్టు సమాచారం.అదే కాని నిజం అయితే ధోనికి కశ్మీర్ లోయ పరిసర ప్రాంతాల్లో శిక్షణ ఉండే అవకాశం ఉంది.