వైసీపీ పార్లిమెంటరీ పార్టీ నేత విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేదికగా చంద్రబాబుకు మరోసారి చురకలు అంటించారు. చంద్రబాబు ఐదేళ్ళ పాలనలో అన్యాయాలు,అక్రమాలు చేసి చల్లగా జారుకున్నారని చెప్పుకొచ్చారు. చంద్రబాబు ప్రభుత్వ సంస్థలన్నింటినీ నిర్వీర్యం చేసి కమీషన్ల కోసం ప్రైవేటు కంపెనీలను ప్రోత్సహించారని. సహకార డెయిరీలు, విద్యాసంస్థలు, ఆర్టీసీ, ఏపీ జెన్కో, డిస్కాంలు అన్నీ దివాళా తీస్తుంటే రోగానికి చికిత్స చేయకుండా సపట్ మలాం పూసి చల్లగా జారుకున్నారు అన్నారు. ఇంకో ట్వీట్ లో ప్రపంచమంతా గ్రీన్ ఎనర్జీని ప్రోత్సహిస్తున్నందునే పవన విద్యుత్తును ఎక్కువ ధరకు కొన్నామంటూ చిట్టి నాయుడు మోకాలికీ బోడి గుండుకు ముడిపెడుతున్నాడు. నదిని పూడ్చి ఇళ్లు కట్టుకుంటే తప్పేమిటని వాదిస్తారు. దొంగలకిచ్చే నోబెల్ ప్రైజ్ ఏదైనా ఉంటే బాప్-బేటాలకు జాయింట్గా ఇవ్వాలని ఎద్దేవా చేసారు విజయసాయి రెడ్డి.