గడిచిన సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ చిత్తు చిత్తుగా ఓడిన విషయం విధితమే. ప్రజలు ఈ ఐదేళ్ళు చంద్రబాబు చేసిన అక్రమ పాలనకు విసిగిపోయి ఈ ఎన్నికల్లో బాబుకి సరైన బుద్ధి చెప్పారు. అసెంబ్లీ సాక్షిగా ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నేతలపై విరుచుకుపడ్డారు. మోసపూరిత పనులు, అబద్ధాలు మేము చేసేవి కాదని అది మీకు మాత్రమే సాధ్యమని జగన్ స్పష్టం చేసారు. తమ మేనిఫెస్టో ఏపీ ప్రజలు అందరికి చూపించామని అది చూసాకే మమల్ని నమ్మి ఓట్లు వేసి గెలిపించారని ఆయన అన్నారు. మంగళవారం ప్రారంభమైన అసెంబ్లీ సమావేశాల్లో జగన్ ఇచ్చిన హామీల పట్ల కొందరు టీడీపీ నాయకులు వక్రీకరించే ప్రయత్నం చేయడంతో స్పందించిన జగన్ వారికి గట్టి కౌంటర్ ఇచ్చారు.
తమ మేనిఫెస్టో పట్ల ప్రజలు ఆనందంగా ఉన్నారని,మీకు ఇంకా క్లారిటీ కావాలంటే నేను ప్రజసంకల్పయాత్రలో చెప్పిన మాటలు ఒకసారి వినండి అని చెప్పారు.దీనికి సంబంధించిన వీడియోను జగన్ కోన రఘుపతి అనుమతితో అసెంబ్లీలో ప్రదర్శించడం జరిగింది. చంద్రబాబులా మోసం చేసే అలవాటు మాకు లేదని, గత ఎన్నికల్లో టీడీపీ ఇచ్చిన 600 హామీల్లో ఏ ఒక్కటైనా చేసి చూపించారని అని ప్రశ్నించారు.