Home / 18+ / కాశ్మీర్ లోయలో విధులు నిర్వహించనున్న లెప్టినెంట్ కల్నల్ ధోని..!

కాశ్మీర్ లోయలో విధులు నిర్వహించనున్న లెప్టినెంట్ కల్నల్ ధోని..!

టీమిండియా జట్టు మాజీ సారధి, ప్రస్తుత వికెట్ కీపర్ మహేంద్ర సింగ్ ధోని… క్రికెటర్ గా ఇండియా ప్రతిష్టను ప్రపంచ దేశాల ముందు మరింత పెంచాడు. అతడి కెప్టెన్సీలో భారత్ తిరుగులేని శక్తిగా ఎదిగింది. వన్డే ప్రపంచ కప్ మరియు  టీ20 ప్రపంచ కప్ తో పాటు మరెన్నో ప్రతిష్టాత్మక విజయాలను సాధించింది ఇండియా. ధోని క్రికెటర్ నే కాదు గొప్ప దేశభక్తుడు కూడా. ఎంత భక్తి అంటే దేశంకోసం తనకి  ఇష్టమైన క్రికెట్ ను వదులుకోడానికి కూడా సిద్ధపడతాడు. దీనికి ఉదాహరనే దేశ రక్షణ కోసం ధోని తాజాగా వెస్టిండిస్ పర్యటనకు దూరం అవ్వడం.

ఇండియన్ ఆర్మీలో గౌరవ లెఫ్టినెంట్‌ కల్నల్‌ హోదాలో ఉన్న ధోని రెండు నెలలపాటు పారామిలిటరీ రెజిమెంట్‌తో కలిసి పనిచేయాలని నిర్ణయించుకున్నాడు. ఈ మేరకు ధోని కాశ్మీర్  లోయలో విధులు నిర్వహించాల్సిందిగా ఉన్నతాధికారుల నుండి ఆదేశాలు రావడం జరిగింది. ఈనెల 31 నుండి ఆగస్ట్ 15 వరకు ధోనితో సహా యూనిట్ మొత్తం అక్కడే విధులు నిర్వహించనుంది. అయితే ఇతడు ఒక క్రికెటర్ మరియు ఫేమస్ వ్యక్తి కావడంతో మంచిగా సౌకర్యాలు ఉంటాయని అందరు అనుకోవచు..కాని ధోనికి మాత్రం అందరికి ఉన్న సౌకర్యాలే ఉంటాయి.

 

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat